29, ఏప్రిల్ 2011, శుక్రవారం

కందికొండ

ఎ. జనార్ధన్
నవరసాలూరించే పాటలు రాయడమంటే అంత తేలిక కాదు. రాసిన ప్రతి పాటా ఆడియన్స్ నోళ్లలో నానించడమూ అంత ఈజీ కాదు. కానీ రాసిన ప్రతి పాటనూ ఒక కోటగా మార్చిన ఘనత కందికొండది.
స్పాట్
సినీ ఫీల్డ్ లో, తన సొంత గ్రామం వారికి తప్ప ఇంత చక్కని స్వరాలూరించే పాటలు రాసిన కందికొండ గురించి చాలా మందికి తెలియదు. మళ్ళి కూయవే గువ్వా పాట తెలియని సంగీతాభిమాని లేడు. అంతేకాదు గలగల పారుతున్నగోదిరిలా పాట హమ్మింగ్ చేయని వారుండరు. కానీ ఈ పాటలకు ప్రాణం పోసిన కవి కందికొండ.
స్పాట్
కందికొండ పుట్టింది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగూర్లపల్లి గ్రామం. ప్రాథమిక విద్య సొంతూర్లో పూర్తయింది. డిగ్రీ వరకు మహబూబా బాద్ లో చదువుకున్నరు. యం.ఎ తెలుగు లిటరేచర్ పూర్తి చేసి యం.ఎ పొలిటికల్ సైన్స్ చదువుతున్నరు.
స్పాట్
కందికొండ తాను చదువుకునే రోజుల నుంచే పాటలు రాయడం నేర్చుకుండు. మొదట్లో జానపద గీతాలు రాస్తున్న కందికొండకు సినీ సంగీత దర్శకుడు చక్రి సాన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపిండు. చక్రి సంగీత దర్శకత్వంలో తొలిసారిగా ఇట్లు శ్రావణి సుభ్రమణ్యం. చిత్రంలో మళ్లి కూయవే గువ్వా పాటరాసి తానేంటో నిరూపించుకున్నడు.
స్పాట్( మళ్లి కూయవే గువ్వా పాట)
ఈ పాట తరువాత కందికొండ వెనకడుగు వేసింది లేదు. పాట వెంట పాట పందిరిలా సినీ సంగీతాభిమానులను అల్లుకుపోయినయి. తన చాలా పాటలకు ప్రాణం పోసింది చక్రియే నని, తానింతటి వాడు కావడానికి తనను ప్రోత్సహించింది చక్రీ అని వినమ్రంగా చెప్పుకుంటడు.
స్పాట్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి