29, ఏప్రిల్ 2011, శుక్రవారం

మిట్టపల్లి సురేందర్ ( కవి, గాయకుడు)

మిట్టపల్లి సురేందర్….
అడవి బిడ్డల గుండె గొంతును తన కలంతో పలికించినోడు..(ఆదిలాబాద్ జిల్లరా పాట బ్యాక్ గ్రౌండ్) పల్లెపచ్చదనాన్ని పండువెన్నెల చల్లదనాన్ని తన పాటలల్లో ఒదిగించినోడు..(పండువెన్నల పాట బ్యాక్ గ్రౌండ్) ఉద్యమ పాటలకు ఊపిరి పోసిన పల్లెకవి.. ఎండుటాకుల వెన్నుపూసలు దీసి ఆయుధాలనిచ్చి, అడవి పోరాడమన్నదని విప్పి చెప్పిండు. కన్నబిడ్డలను కోల్పోయిన వీరమాతల గర్భశోకాన్ని తలచి రాతి బొమ్మలల్ల కొలువైన శివుణ్ని ఇదేం రాత అని ప్రశ్నించిండు. తలరాతను మార్చే బతుకుకోసం ఎదిరించి పోరాడమని బోధించినోడు మిట్టపల్లి సురేందర్.
స్పాట్
మధురమైన పాటలు రాసిన మిట్టపల్లి సురేందర్ పుట్టింది వరంగల్ జిల్లా చిట్యాల మండలం..వెల్లంపల్లిగ్రామం. తండ్రి నర్సయ్య, తల్లి మధునమ్మ. తన పాటకు ప్రాణం పల్లె జీవితమే నంటడు..తాను రాసిన గేయాలన్నీ బడుగు జీవుల మనసు గాయాలను మాన్పేవేనని సగర్వంగా చెప్పుకుంటడు. గోరటి వెంకన్న, చంద్రబోస్, అందెశ్రీ, వేటూరి వంటి కవులు రాసిన సాహిత్యం తన పాటలకు స్పూర్తని అంటడు. సురేందర్ గుభాళించిన సాహితీ సౌరభాలు తెలంగాణ పల్లెల్లో ఇంటింటా గుప్పుమంటున్నయి. సురేందర్ సినిమాల్లో కూడా పాటలు రాసిండు. నాన్ స్టాప్, ధైర్యం వంటి చిత్రాల్లో సినీగేయాలు రాసి సినీ ప్రముఖుల చేత శబాష్ అనిపించుకున్నడు. సురేందర్ స్పృషించని సామాజిక అంశం లేదు, తాకని తండ్లాట లేదు. ఇన్ని పల్లె పాటలు రాసిన సురేందర్ మరిన్ని మంచి పాటలు రాయాలని కోరుకుందాం..
వడ్లకొండ అనిల్ కుమార్..
సురేందర్ కలానికి గళమైనిలిచిన వ్యక్తుల్లో అనిల్ ఒకరు. పాటకు కొత్త హొయలు దిద్ది ప్రాణం పొసిన గాయకుడు. పుట్టింది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం, జమ్మికుంట గ్రామం. తండ్రి మొగిలయ్య, తల్లి సుగుణమ్మ. బార్డర్ లో సైనికుడా పాటతో వడ్లకొండ అనిల్ కుమార్ ప్రపంచానికి పరిచయం అయిండు. యం. కామ్ పూర్తి చేసిన అనిల్ చదువుకునేటప్పటి నుంచే తన గళానికి పదును పెట్టిండు. యన్ యస్సెస్ లో ఢిల్లీ రిపబ్లిక్ డే కు సెలక్టయిండు. ఆ అవకాశంతో ఢిల్లీ వారణాసిలలో పాటలు పాడిండు. తన పాటలు ఖండాతంరాలను వ్యాపింపజేసిండు అనిల్. మలేషియా వంటి దేశాలలో కూడా తన గళమాధుర్యాన్ని వినిపించిండు.
స్పాట్( ఇద్దరివి కలిపి)
తెలంగాణ కళాకారులు మిట్టపల్లి సురేందర్, వడ్లకొండ అనిల్ కుమార్ లు మరిన్ని స్వరశిఖరాలు అధిరోహిచాలని కోరుకుందాం..

ఆకునూరి దేవయ్య (తెలంగాణ గళం)

ఎ.జనార్ధన్
స్పాట్
తెలంగాణ ఉద్యమంలో ఎందరో కవులు గాయకులు తమ పూర్తి కాలాన్ని ఉద్యమానికి అంకితం చేశారు. తెలంగాణలో ఊరూరా వాడవాడనా ఇటువంటి కవి గాయకులకు కొదవలేదు. తెలంగాణలో ఏ కొమ్మను కదిలించినా జానపదాలను జల్లున రాల్చుతది. ఉద్యమ పాలటను ఊటలా రాల్చుతది. అలువంటి పాటల ఊటే ఆకునూరి దేవయ్య.
స్పాట్
ఆకునూరి దేవయ్య పుట్టింది కరీంనగర్ జిల్లా సిరిసిల్ల గ్రామం. తండ్రి ఆకునూరి నర్సవ్వ, తండ్రి వెంకటయ్య. డిగ్రీ వరకు చదువుకున్న దేవయ్యకు పాటంటే ప్రాణం. స్కూల్ చదివేటపుడే దేవయ్యలో పాటగాడు నిద్రలేచిండు. తన తోటి వారి ముందు జానపద గీతాలు ఆలపించి శబాస్ అనిపించుకున్నడు. అదే స్పూర్తి దేవయ్యలో కొనసాగింది. ఏ కొత్త జాన పదం విన్నా ఇట్టే పట్టేస్తడు. జాన పదాలను సేకరించి ముందు తరాలకు అందివ్వాలనే లక్ష్యంతో పనిచేస్తుండు.
స్పాట్
ఆకునూరి దేవయ్య పాటలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఇప్పటికే ఎన్నో ప్రదర్శనలిచ్చిండు. మొట్టమొదటి సారిగా 1984లో రేడియోలో జానపదగీతాన్ని ఆలపించిండు. ఆ తరవాత రేడియోలో ఎన్నోప్రదర్శినిచ్చిండు. 1994లో దూరదర్శన్లో కూడా జానపదాల రుచి చూపించి ప్రజలకు మరింత చేరువయిండు.
స్పాట్
తెలంగాణ మలిదశ ఉద్యమంలో దేవయ్య పాత్ర మరవలేనిది.ఎన్నో తెలంగాణ ధూంధాలలో పాల్గొని ప్రజాచైతన్యం కోసం పాటు పడిండు. ఆయన ఆలపించిన తలాపునా పారుతుంది గోదారి అన్నపాట, రేలాదూలా అన్న పాట ప్రజా బాహుళ్యంలో ఇంకిపోయినయి.ఒక్కకరీంనగర్ లోనే కాదు తెలంగాణ ప్రాంతం మొత్తంలో ఈ పాటలు మార్మోగి పోయినయి.
స్పాట్

నర్సిరెడ్డి, నల్లగొండ సైదులు (ఉద్యమ గళాలు)

Mm pkg 17/04/2011
తెలంగాణ మాగాణం నిండా తడి ఆరని గాయాలే.. ఈ గాయాలను మాన్పే గేయాలు ఎన్నో పుట్టుకొచ్చినయి. ఆ గేయాలు కళాకారుల గళంలో నిప్పు కణికలై చిచ్చర పిడుగులై దోపిడి దారుల గుండెల్లో మంటలు రేపినయి. తెలంగాణ కళామతల్లి బిడ్డలంతా ఒక్కటయిన్రు. పచ్చని పైర్లను కలలు గన్న నా తెలంగాణ పడావెందుకు బడ్డదని గొంతెత్తిన్రు. అలా ఊరూరా వాడ వాడనా కళాకారులు ఉద్యమంలో గళం కలిపిన్రు. అలా వెలిగిన తెలంగాణ కళామతల్లి నుదిటి సింధూరాలే.. సైదులు, నర్సిరెడ్డి.
Intro Anchor
పాటంటే నర్సిరెడ్డికి ప్రాణం.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎందరో మేటి కళాకారులకు ఏకలవ్య శిశ్యుడుగా ఎదిగిన నర్సిరెడ్డి, ఉద్యమమే ఉపిరిగా.. ఎన్నో ధూంధాం సభలల్లో గళం వినిపించిన నకిరెకంటి సైదులు మనతో ముచ్చట బెట్టేందుకు టి. న్యూస్ కు వచ్చిన్రు.
Voice over
తెలంగాణను పరాయి పాలననుంచి విముక్తి కలిగించేందుకు ఎందరో కళాకారులు తమ గళాలకు పదును పెట్టిన్రు. తెలంగాణ పది జిల్లాలలో పదం నేర్చిన ప్రతి బిడ్డా, పాట నేర్చిన ప్రతి గాయకుడు ఉద్యమానికి ఊతమయిన్రు. అలా తెలంగాణ ఉద్యమంలో తన వంతుగా పాటలు రాస్తూ పాడుతున్న కళాకారుడు నకిరికంటి సైదులు.
స్పాట్
ఒళ్లంతా ఉద్యమ సారాన్ని నింపుకున్నట్టు గళమెత్తుతున్న ఈ కళాకారుడి పేరు నకిరికంటి సైదులు. సైదులు పుట్టింది నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం కాజీరామారం గ్రామం. తండ్రి పాపయ్య, తల్లి సాలమ్మ. సైదులుకు చిన్నప్పటి నుంచి పాటలు పాడటమంటే చాలా ఇష్టం . ఆ ఇష్టమే అతణ్ని ప్రజానాట్యమండలి వైపు నడిపించింది. విద్యార్ది ఉద్య మాల్లో చురుకైన పాత్రపోషించిన సైదులు తరువాత ఉద్యమం వైపు నడిచిండు. 2007 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నడు. తెలంగాణకు జరిగిన ధోకా మీద పాటలు గట్టిండు. ఇప్పటి వరకు దాదాపు 150 ధూంధాంలలో పాల్గొన్నడు. 25 ఏళ్లుగా ఉద్యమగీతాలు ఆలపిస్తున్న సైదులు స్వరాలు ఉద్యమానికి మరింత ఊపునిస్తయని ఆశిద్దాం.
స్పాట్
చాలా మందికి పాట పాడాలని ఉంటది..కానీ పాట పాడగల గళం కొందరికే సొంతం.. ఒకవేళ పాట పాడ గలిగినా.. ఎవరికి వారికి ఓ స్టైల్ అంటూ ఉంటది. కానీ ఇక్కడ మనం చూస్తున్న ఈ కళాకారుడు ఉద్యమ ప్రస్థానంలో దిట్ట అనుకుకున్న మేటి కళాకారుల గొంతులను తన గళంలో ఒంపుకొని వారే ఇతనిలోకి పరకాయ ప్రవేశం చేసిన్రా అన్నట్టుగా పాడగలడు. ఒకే గళంలో వివిధ రకాల వ్యక్తుల గొంతులను పలికించ గల స్వరవిన్యాసం నర్సిరెడ్డికే సొంతం. నర్సిరెడ్డి పుట్టింది నల్లగొండ జిల్లా చండూరు మండలం గుండ్రపల్లి గ్రామం. 12 సంవత్సరాల నుంచి పాట పాడుతున్న నర్సిరెడ్డి ఎన్నో సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నరు.
స్పాట్

రామాచారి (సంగీత దర్శకులు, మ్యూజిక్ డైరక్టర్, సింగర్

ఎ. జనార్ధన్
కొమాండూరి రామాచారి..ఇప్పడీ పేరు తెలియని సంగీత సాధకులు లేరంటే నమ్మలేం.. అంతగా సంగీత సరస్వతి పుత్రుల మదిని దోచిన స్వరసంపాదకుడు రామాచారి.. ఛానళ్లలో ప్రసారమవుతున్న మ్యూజికల్ ప్రొగ్రాంలలో ఆయన శిశ్యులే అధికం.. ప్రతి పదిమందిలో ఒకరు రామాచారి శిశ్యలమని గర్వంగా చెప్పుకుంటరు.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందలాది మందిని గాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది..ఈ కఠోర తపస్సు వెనక సంవత్సరాల తరబడి చేసిన శ్రమ, పట్టుదల, ఆవేదన. ఆశయం ఉన్నయి. పాటే తన పంచ ప్రాణాలంటడు..తన జీవితమే ఒక పాటని అంటడు..
స్పాట్ (సాంగ్)
సంగీతస్వరసృష్టికర్త రామాచారి పూర్తిపేరు కొమాండూరి రామాచారి.. సినీ పరిశ్రమలో ఈయన్ను శ్రీరామ్ కౌశిక్ గా పిలుచుకుంటరు.. ఈ స్వరశిఖామణి 1964 జనవరి 27న జన్మించిన్రు. తండ్రి కృష్ణమాచార్యులు తల్లి యశోద.. మెదక్ జిల్లా శివంపేట మండలం గొట్టిముక్కల స్వగ్రామం.. రామాచారికి చిన్నప్పటి నుంచి పాటలు పాడటమంటే ఆసక్తి. స్వరమే తన సర్వస్వమని భావించిండు..అంతేకాదు గాయకుడిగా రాణించాలనే బలమైన తపన.. ఆ తపనే తనను సంగీతం వైపు నడిపించింది. బిఎ, బిఇడి డిగ్రీలతో పాటు సంగీతభూషణ్ కోర్సును అభ్యసించింన్రు.. మ్యూజిక్ టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసి సంగీతం మాస్టార్ గా కెరీర్ ప్రారంభించిన్రు. తన అనుభవాన్ని జోడించి విద్యార్ధులకు సంగీతంలో మెళకువలన్నీ నేర్పేవారు. వందలమంది విద్యార్ధుల చేత కచేరీలు ఇప్పించడం ఛానళ్లకు పరిచయం చేయండం చేస్తుండే వాడు.. ఆయన తొలిపాట 1979లోఆకాశవాణిలో ప్రసారమై ఖండాంతరాలు వ్యాపించింది. అప్పుడు మొదలైన ఆ సంగీత ప్రస్థానం ఎన్నో మైలు రాళ్లు అధిగమించింది.. ఇప్పుడు రాష్ర్టంలో రామాచారి అంటే తెలియని వారు లేనంత ప్రాచుర్యం పొందిన తెలంగాణ కళామతల్లి ముద్దుబిడ్డ రామాచారి..
స్పాట్
రామాచారి తన సంగీత సోపానాలలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నరు..ఒక దశలో తాను పడ్డ కష్టాల కొలిమిలో తన ఆశయం ఆవిరవుతుందేమోనని భయపడ్డడు కూడా.. ఎంతో మందికి టాలెంట్ ఉండి కూడా ప్రొత్సాహంలేక, సరియైన శిక్షణ లేక మరుగున పడుతున్నరని గ్రహించిండు.. అందుకే తాను పడ్డ ఇబ్బందులు మరెవరూ పడకూడదని 1999లో లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ నెలకొల్పి లేత స్వరపుష్పాలను ఒక్కచోట చేర్చి సంగీత శిక్షణ నిస్తున్నారు. పాడగల ప్రతి శిశువుకూ పైసా తీసుకోకుండా పాటనేర్పుతున్నరు. ఈ ఉచిత సేవ వెనుక మథర్ థెరిస్సా సేవా భావమే స్పూర్తి అని చెప్పుకుంటడు. ఒక సంగీత శిక్షకుడి గానే కాక మంచి గాయకుడిగా, సంగీత దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నరు రామాచారి.
స్పాట్
రామాచారి ఎన్నో ప్రైవేట్ ఆల్బంలలో పాటలు పాడిన్రు. సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిండు..శ్వేతనాగు, శ్రీరామదాసు, బాలరామాయణం, సంబరం వంటి చిత్రాలలో పాటలు పాడిన్రు. సమాంతరరేఖలు, బుచ్చిబాబు, పరమానందయ్య శిశ్యుల కథ, వంటి సీరియల్స్లో కూడా పాటలు పాడిన్రు. ఇవికాక అనేక భక్తి గీతాల ఆల్బంలలో స్వరాలాపన చేసిన్రు. ప్రేమలేఖ రాశా సినిమాకు సంగీత దర్శకులుగా పని చేసిన్రు.
స్పాట్
రామాచారి కీర్తి ఖండాంతరాలకు వ్యాపించింది.. దేశం నలుమూలలా పాడటంతో బాటు దుబాయ్, షార్జా, కువైట్, అమెరికా వంటి దేశాలలో పాటలతో స్వరసమ్మోహితులను చేసిన్రు. ఇప్పటికీ ఎందరో విద్యార్ధులచేత దేశవిదేశాలలో కచేరీలు ఇప్పించే అవకాశం కల్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నరు.
స్పాట్
రామాచారి సరసన ఎన్నో అవార్డులు చేరి తమ గౌరవాన్ని పెంచుకున్నయి. కళారాధన, అనురోధ్, శిల్పా ఆర్ట్స్, యువశక్తి వంటి అవార్డులు ఆయన ఖాతాలో చేరినయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నంది అవార్డునిచ్చి సత్కరించింది..రామాచారి సంగీత గమకాల గమనంలో తన సతీమణి సుజాత సహకారం మరువలేనిదని చెప్పుకుంటడు. అంతేకాదు రామాచారి పిల్లలు కూడా తండ్రికి తగ్గ పిల్లలుగా రాణిస్తున్నరు. కుమారుడు సాకేత్, కూతురు సాహితి ఇరువురు కూడా పాటలు పాడటంలో తండ్రికి తగ్గ బిడ్డలుగా తమను తాము రుజువు చేసుకుంటున్నరు. ఆ ఇల్లు సంగీత వనం.. రేపటి స్వర పుష్టాలకు వనమాలి రామాచారి.

రసమయి బాలకిషన్ (తెలంగాణ ఉద్యమ గళం)

ఎ.జనార్ధన్
తెలంగాణ పల్లెసిగలో సాహిత్య మందారాలు పరిమళిస్తయి. అందులో మొగ్గగానే మగ్గిపోయిన జానపదాలు కొన్నైతే.. ఉద్యమాల బాటలో రాలిపోయిన మౌన రాగాలు కొన్ని. ఆ ఆవేదనలను గుండెకు హత్తుకొనేలా వినిపించే వాడే కళాకారుడు. అటువంటి కళాకారులకు తెలంగాణ మాగణమే కాణాచి.ఆ మట్టిలోంచి పుట్టిన సాహత్యమాణిక్యమే రసమయి బాలకిషన్..
స్పాట్
రసయయి బాలకిషన్.. తెలంగాణ సాహిత్యాభిమానులందరికీ బాగా పరిచయం ఉన్న పేరు. ఆ మాట కొస్తే ఏ చిన్న పిల్లవాణ్ని అడిగిన ఆయన పేరు ఇట్టే చెప్పేస్తరు. ఎందుకంటే ఆయన మాటటు మంత్రాల్లా ఆకట్టుకుంటయి. ఆ పదాల్లో వశీకరణ సూత్రాలు తొణికిసలాడుతుంటయి. ఒక విషయాన్ని విప్పిచెప్పాలంటే రసమయికి సాటిలేరు. ఎందుకంటే ఆయన చెప్పే పిట్టకథయినా కట్టుకథయినా మనసుకు హత్తుకొని తీరాల్సిందే. ఇక తెలంగాణ పాటకు ప్రాణం పోసి..వాటిని ఇంటింటా సుప్రబాతాల్లా సవ్వ్డడి చేయించడం రసమయికే చెల్లింది. మన మట్టిలో మరుగున పడ్డ జానపదాలకు జీవజలాన్ని గుప్పించి జలపాతంలా దుంకించడంలో రసమయి కూడా తనవంతు పాత్రపోషించిండు.
స్పాట్
తెలంగాణ ఉద్యమంలో పాటే ఆయుధం..ఉడుకెత్తించే నాలుగు మాటలకన్నా ఒక్కపాట పరుగులెత్తిస్తది. అలా ఉద్యమంలోకి ఉరుకులు పెట్టించడంలో రసమయి అందెవేసిన చేయి. వృత్తి రీత్యా ఉపాద్యాయుడు కావడం వల్ల విషయాన్ని విపులంగా చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ కదిలే జానపదాల గ్రంధాలయం పుట్టింది మెదక్ జిల్లా సిద్దిపేట మందలం రావురూకల గ్రామం..రసమయి అసలు పేరు వేల్పుల బాలకిషన్. జానపదాలన్నా గ్రామీణ వాతావరణమన్నా, అచ్చమైన తెలంగాణ యాసన్నా ఆయనకు వల్లమాలిన అభిమానం. అందుకే ఇంటర్ లోనే రసమయి అనే సాహితీ సంస్థను ఏర్పాటు చేసిండు. ఆ సంస్థ పేరే తరువాత ఇంటి పేరయింది.
స్పాట్
రసమయి ఒక్క తెలుగులోనే కాదు కన్నడంలో కూడా పాడగలడు. తెలంగాణ ఉద్యమంలో రసమయి పాత్రమరవలేనిది. ఆయన పాల్గొన్న ఉద్యమ సభ ఏదైనా సరె వలస పాలకుల ధోకాను విప్పి చెప్పేవాడు. పాఠ్యపుస్తకాల్లో ఉన్న పరవళ్లు పంట పొలాల్లో ఎందుకు లేవో వివరిస్తడు. బడుగు జీవుల బతుకులెట్లున్నయో గుండె గొంతుకలోంచి వినిపిస్తడు. నిజ జీవితంలో రగిలిన నిట్టూర్పులను ఒడిసిపట్టిండు కాబట్టే ఉద్యమ సెగలను పల్లెపల్లెనా పంచిపెట్టిండు. తెలంగాణ ధూంధాం పేరుతో కళాకారలందరి గళాలను ఒక్కవేదిక పైకి తెచ్చిండు. కామారెడ్డిలో కదిలిన ధూంధాం పల్లెపల్లెకూ విస్తరించింది. ఉద్యమ సభలన్నీ ఇవాళ ధూంధాం లేకుండా జరగట్లేదంటే దానికి తాను వేసిన పునాదే కారణమంటడు బాలకిషన్.
స్పాట్
తెలంగాణ కలాలను, గళాలను ఊరూరా విస్తరించడంలో రసమయి బాగా కృషి చేసిండు. ఆయన తీసిన సిడిలలో ఊరు తెలంగాణ వంటి వీడియో సిడి అత్యంత ప్రజాదరణ పొందింది. ఇందులో పల్లె వెతలను పట్టి చూపిండు. ఎన్నో ఆడియో సిడిల ద్వారా ఉద్యమ గేయాలను ప్రజలకు పంచిపెట్టిండు. అదే స్పూర్తితో ఇప్పుడు రసమయి యమలోకంలో జైతెలంగాణ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నడు. ఈ సినిమా దాదాపు పూర్తయి సెన్సార్ బోర్డు దగ్గరకు వెళ్లబోతోంది.
స్పాట్
పదేళ్లుగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో రసమయి ప్రత్యక్షంగా పాల్గొన్నడు. అరెస్టులు, జైళ్లు ఆయనకు మామూలే. తెలంగాణ ఉద్యమానికి ఒక సైనికుడి మాదిరిగా పనిచేసిండని చెప్తరు ఆయన గురించి తెలిసన వాళ్లు. నవ రసాలను ఒలికింప జేయగల రసమయి రాగాలు మరిన్ని పూయాలి. అవి తెలంగాణ మాగాణంలో వెల్లి విరియాలి.

రవి వర్మ (సినీ గాయకులు)

రవి వర్మ గాయకుడు
మనిషి ప్రాణ నాడులను తట్టిలేపే పాట పాడగలగడం కొందరికే సొంతం.. మోడువారిన మనసుకు స్వరపుష్పాలతో వసంతాన్ని చిలకరించ గల శక్తి ఒక్క పాటకే ఉంది. ఆ గానామృత ధారలను కురిపించే శక్తిని సొంతం చేసుకోవడం ఒక వరం. ఆ వరాన్ని పొందిన మెలోడి అండ్ మాస్ సింగర్ రవివర్మ.
స్పాట్
రవివర్మది మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ మండలం, దుండ్యాల గ్రామం. తండ్రి నారాయణాచారి, తల్లి,సరోజినమ్మ. భార్య సుమ, కూతురు సహన.. రవి చదువంతా వరంగల్లోనే సాగింది. కళాశాల వయసు నుంచే పాటలంటే రవివర్మకు ప్రాణం. గాయకుడిగా ఎదగాలని ఎంతో తపించేవాడు. దానికోసం ఎంతో ప్రయత్నించిండు. ఆయన తొలిసారి చిత్రం సినిమాలో పాడిన ఢిల్లీ నుంచి గల్లీ దాక అనే పాట కెరీర్ లో మొదటి పాటగా నిలిచింది. ఈ పాట రవివర్మ కెరీర్ను మలుపుతిప్పింది. గల్లీ నుంచి ఖండాంతరాలను దాటించింది.
స్పాట్
రవి వర్మ మంచి సంగీత దర్వకత్వ పటిమ గల వ్యక్తి కూడా. ఆయన స్వయంగా వైరస్ అనే ఆల్బం ద్వారా సంగీతాభిమానులకు మరింత చేరువయిండు. తెలుగు సంగీత ప్రపంచంలో రవివర్మ తరదైన ముద్ర వేసుకోగలిగిండు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ , కన్నడ భాషల్లో ఎన్నో పాటలు పాడిండు. ప్రైవేట్ ఆల్బంలలో 500లకు పైగా పాటలు పాడిండు.
స్పాట్
తెలుగు సినమాల్లో రవివర్మ పాడిన పాటల్లో మాస్ సినిమాలో మమమాస్పాట..ఇడియట్ లో చెలియా చెలియా పాట..భద్ర సినిమాలో ఓ మనసా ఓమనసా అనే పాట చాలా ప్రజాదరణ పొందినయి. జయం సినిమాలో బండి బండి రైలు బండి పాటకూడా చిన్నపిల్లలనుంచి పెద్దవాళ్ల దాకా హమ్మింగ్ చేసేదే..లారెన్స్ యాక్ఠ్ చేసిన స్టైల్ మూవీలో టైటిల్ సాంగ్ ప్రతి డాన్స్ లెర్నకు ఉత్తేజాన్నిచ్చే మంత్రం.
స్పాట్
రవివర్మ గళంలో మాస్ మసాలా పాటలు, మెలోడి మధురిమలు అలవోకగా ఒదిగిపోతయి. ఆ సుస్వరాల సవ్వడిని ఎంత విన్నా తనివి తీరదు. అందుకే ఎందరో సంగీత దర్శకులు ఆయన పాటలకు అభిమానులై పాడించుకున్నరు. తెలంగాణ స్వరమాంత్రికుడు చక్రి, మ్యూజిక్ తో మాజిక్ చేసే కీరవాణి,. సూపర్ మ్యూజిక్ డైరక్టర్ మణిశర్మ., యూత్ఫుల్ మ్యూజిక్నందించే ఆర్పీ పట్నాయక్లు రవివర్మ గమకాలతో గందర్వస్వరాలను మదించిన్రు.
స్పాట్
రవివర్మ స్వరాలకు తగిన గుర్తింపే లభించింది. ఎన్నో అవార్డులు ఆయన సరసన చేరి ఉప్పొంగిపోయినయి.ఆయన పాడిన తొలిపాటకే “అలాపన మ్యూజిక్ అవార్డు” సొంతం చేసుకున్నరు...చిత్రం సినిమాలో పాడిన డిల్లీ నుంచి గల్లీదాక పాటకు బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ విభాగంలో ఈ అవార్డు వచ్చింది. ఆర్య చిత్రంలో ఓ మైబ్రదరు అనే పాటకు 2004లో వంశీ స్పెషల్ జ్యూరీ అవార్డు ను సొంతం చేసుకున్నడు. 2006లో సంగం సుశీల యూత్ అవార్డును సొంతం చేసుకుండు. రవివర్మ కెరీర్లో ఎన్నోమైళ్లు అధిగమించిండు. తన విజయాల వెనక తనకుంటుంబ ప్రోత్సాహం చాలా ఉంటదని గర్వంగా చెప్పుకుంటడు రవివర్మ. రవివర్మ స్వరజల్లుల్లో మనమూ తడిసి తరిద్దాం..

యశ్‌ పాల్ (తెలంగాణ ఉద్యమ గళం)

ఎ. జనార్దన్
యశ్ పాల్ పోరాటాల పురిటి గడ్డ ఖమ్మం జిల్లా వాగ్గేయకారుడు. కమ్మునిస్టు ఉద్యమంలో పనిచేస్తూ, అరుణోదయ సాంస్కృతిక విభాగంలో పని చేస్తూ ఉద్యమాన్ని ఉరుకుల పెట్టించే పాటలు కట్టిండు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500ల పైచిలుకు పాటలు రాసిండు..ప్రతి పాటా ఒక సందేశమిచ్చేదే.. యశ్ పాల్ పుట్టింది ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామం. తండ్రి వీరస్వామి తల్లి సుక్కమ్మ. పి.జి వరకు చదువుకున్న యశ్ పాల్ కు పాటలంటే ప్రాణం. తన అక్క శాంతమ్మ పాటలను నరనరానా జీర్ణించుకొని సాహిత్యం వైపు అడుగులేసిండు.
స్పాట్
యశ్ పాల్ పాటల్లో సాహిత్యం కంటే ఎక్కువ ప్రజల జీవితం ఉంటది. ఆవేదన ఉంటది. అణిచివేత పై ధిక్కారం ఉంటది. యశ్ పాల్ పాటల్లో వర్తమానం, చరిత్రల మేళవింపు ఉంటుంది. గ్లోబలైజేషన్ పై ఎక్కుపెట్టిన అస్ర్రాలు యశ్ పాల్ అక్షరాలు. పండుటాకులా ఎండిపోతున్న కులవృత్తులగురించి, గ్రామీణ ఆట పాటపై ఎన్నో పాటలు రాసిండు. యశ్ పాల్ పాటల్లో అమరులు నిద్దుర లేస్తరు. చుక్కలై వెలుగులు చిందుతరు. అవిసి పోతున్న ఆటపాటల పై యశ్ పాల్ రాసిన పాటలు గ్రామీణ జీవితం కళ్లముందు కదలాడుతది.
స్పాట్
యశ్ పాల్ ఒక కవిగానే కాక గాయకుడిగా కూడా ప్రపంచానికి పరిచయం. యశ్ పాల్ సాహిత్యాన్ని మెచ్చుకున్న ఎందరో సినీ దర్శకులు తమ సినిమాల్లో పాటలు ప్రజాచైతన్య గీతాలు రాయించుకున్నరు. ఒక రచయిత గానే కాక తెలంగాణ ఉద్యమాల్లో, బీడీ కార్మికులు సమస్యలపై, మహిళల అణిచి వేతపై, ప్రత్యక్షంగా పాల్గొన్నడు. వలసలను నివారించేందుకు, ప్రాజెక్ట్ నిర్వాసితుల రక్షణకోసం చేసిన పోరాటాలలో ప్రత్యక్షం పాల్గొని అనేక సందార్భాలలో పోలీసు లాఠీల దెబ్బలు తిన్నడు. అరెస్టయినా మొక్కవోని ధైర్యంతో ఉద్యమంలో తన తోటి వారికి ఆదర్శంగా నిలిచిండు.
స్పాట్
ఉద్యమానికి సహకరించడం ఒక వంతయితే, కనుమరుగై పోతున్న గ్రామీణ సంస్కృతులను, సాహిత్యం కళలు, జానపదాలను సేకరించి ముందు తరాలకు వాటి గొప్పతనాన్ని తెలిపే ప్రయత్నం చేస్తున్నడు. రైతు ఆత్మ హత్యల పై, బీడి కార్మికుల వెతలపై, మధ్యానికి బానిసై చిద్రమవుతున్నకుటుంబాలపై, నేత కార్మికులు కడగండ్ల గురించి ఇలా చెప్పుకుంటూ పోతే యశ్ పాల్ తడమని సమస్య లేదు. రాయని తండ్లాట లేదు.
స్పాట్
మలి విడత తెలంగాణ ఉద్యమంలో యశ్ పాల్ పాత్ర మరువలేనిది. ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి కాలం పనిచేసి నిత్యం విద్యార్ధులను చైతన్య పరుస్తూ తన పూర్తి సమయాన్ని ఉద్యమానికి అంకితం చేసిండు. అనే క ధూంధాంలలో పాల్గొని ఉద్యమానికి తన వంతు సేవ చేసిండు.

శనిగరం బాబ్జి (తెలంగాణ ఉద్యమ గళం)

ఎ.జనార్దన్
డప్పు దరువుతో, తెలంగాణ దండోరా వేస్తున్న ఈ గాయకుడి పేరు శనిగరం బాబ్జి.. వందలాది ఉద్యమసభల్లో గజ్జకట్టి గళమెత్తిన బాబ్జి పుట్టింది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్. తండ్రి రామయ్య, తల్లి లచ్ఛమ్మ. పాఠశాల వయసు నుంచే పాట పాడటం నేర్చుకున్నడు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో రకాల జానపద పాటలకు, ఉద్యమ గేయాలకు బాబ్జీ గళం ప్రాణం పోసింది.
స్పాట్
శనిగరం బాబ్జి మొదట్లో నాస్తికత్వం పై అనేక ప్రదర్శనలిచ్చిండు. మూఢనమ్మకాల పట్ల ప్రజలను చైతన్యం చేసేందుకు ఎన్నో వేదికల పై తన ప్రదర్శనలిచ్చిండు. నోట్లో మంటలు పుట్టించడం, నిప్పులపై నడక వంటి ప్రదర్శనలతో ప్రజల్లో మూఢనమ్మకాలను తొలగించే ప్రయత్నం చేసిండు. తాను ఆదర్శంగా ఉండి ప్రజలకు ఆదర్శాల గురించి చెప్పాలని కులాంతర వివాహం చేసుకుండు. కమలాపూర్ మండలం కన్నూర్ గ్రామానికి చెందిన అరుణను కులాంతర వివాహం చేసుకున్నడు. బాబ్జి ఒక్క తెలంగాణలోనే కాక దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలిచ్చి మేథావుల చేత ప్రశంసలందుకున్నడు.
స్పాట్
తెలంగాణలో జరుగుతున్న దోపిడి గురించి అనేక ధూంధాం సభల్లో నినదించిండు. ఓపెన్ కాస్ట్ గనుల పేర జరుగుతున్నదోపిడిని విన్పించిండు. తెలంగాణ నీళ్ళను తరలించుకు పోయే ప్రాజెక్ట్ లకు వ్యతిరేకంగా చేసిన పాదయాత్రలో పాల్గొన్నడు. గత పద్నాలుగేళ్లుగా తన గళమాధుర్యంతో ఎన్నో పాటలు పాడి ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నడు శనిగరం బాబ్జి..

బచ్చలకూరి శ్రీనివాస్ (తెలంగాణ ఉద్యమ గళం)

స్పాట్
బచ్చలకూరి శ్రీనివాస్.. తెలంగాన ఉద్యమంలో గజ్జ కట్టి గళమెత్తిన కళాకారుడు. స్వరాష్ర్ట సాధనకోసం జనమంతా ఒక్కటవ్వాలని తన ఆటా పాటా ద్వారా పిలుపునిచ్చిండు. శ్రీనివాస్ పుట్టింది నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ముల్కనూర్ గ్రామం. డిగ్రీ వరకు చదువు కున్న శ్రీనివాస్ కు పాటంటే ప్రాణం. చిన్నతనం నుంచే పాటలు పాడటమంటే చాలా ఇష్టం. ఎక్కడ సామాజిక చైతన్య కార్యక్రమాలు జరిగినా హాజరయి అక్కడ తన గళాన్ని వినిపించేవాడు. జనవిజ్ఞాన వేదిన నిర్వహించే అనేక ప్రజాచైతన్య కార్యక్రమల్లో పాల్గొనేవాడు.
స్పాట్
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న తరుణంలో వేలాది గళాల్లో తానూ ఒక గళమయిండు. ఎన్నో కేసెట్లలో పాడిండు. తానే స్వయంగా తెలంగాణ ప్రజాగళం అనే సంస్థను ఏర్పాటు చేసి తెలంగాణ ధూంధాంలలో పాల్గొంటున్నడు. ఒక్క ఉద్యమగీతాలే కాక వారసత్వంగా వచ్చిన యక్షగానం కూడా పాటగలడు.తెలంగాణ వచ్చేదాకా తాము ఈ ఉద్యమగీతాన్ని అలుపెరగక ఆలపిస్తూనే ఉంటనని చెబుతున్నడు శ్రీనివాస్.
స్పాట్
తెలంగాణ ప్రజా ఉద్యమంలో నేను సైతం అంటూ గజ్జకట్టిన మరో తెలంగాణ కలికితురాయి విఠల్ రెడ్డి. ఈయన పుట్టింది నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం ఎండ్రియాల గ్రామం. విఠల్ రెడ్డికి చిన్నతనం నుంచే సంగీతమంటే ఇష్టం. ఆ మక్కువ తోనే సంగీతం నేర్చుకున్నడు. తెలంగాణ వెనకబాటు తనానికి కారణమేంటో ప్రత్యక్షంగా చవిచూసిండు. అందుకే తాను పడ్డ కష్టాలు ముందు తరానికి రాకూడదని తన పాటను ఆయుధంగా చేసుకొని ఉద్యమ పథలో ధూకిండు. ఎక్కడ ధూంధాం జరిగినా హాజరవడమే కాదు, తానే సొంతంగా దగాపడ్డ తెలంగాణ అనే సి.డి రూపొందించిండు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నడు.
స్పాట్

అరుణోదయ నాగన్న, ఇల్లందు వెంకన్న

ఎ.జనార్ధన్
తెలంగాణలో చాలా మంది కళాకారులకు పేదరికం, పరిసరాలే పాట నేర్పుతయి. దానికి అచ్చమైన ఆనవాలు నాగన్న. అలుపెరగని ఉద్యమ సైనికుడిలా కదంతొక్కుతున్న నాగన్న ప్రస్థానం ఒక్కరోజుది కాదు. ఆయన పాటలు సంఘర్షణల్లోంచి పుట్టినయి. అవి ఇప్పటికీ సమాధానం కోసం నేటికి వెతుకుతూనే ఉన్నయి. నాగన్న పాట వారసత్వం గానే పుట్టింది. తన తండ్రి, తన ఊరు నాగన్నకు పాట నేర్పినయి. ఉద్యమం నాగన్న పాటకు పదును పెట్టింది.. ఉద్యమమే ఊపిరి నిజాయితీ అతని నినాదం. అందుకే పుటకతో వచ్చిన పుట్టెడు కష్టాలు ఇంకా ఆస్తులుగానే మిగిలి ఉన్నయి.
స్పాట్
నాగన్న కలం రాయని జానపద గీతం లేదు..గళమెత్తని ఉద్యమగీతం లేదు..ఇన్ని పాటలను అలవోకగా తన గళంలో జాలువార్చిన నాగన్న పుట్టింది ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం మండలం రాజారం గ్రామం. తండ్రి తాతయ్య, తల్లి లక్ష్మమ్మ. నాగన్న పుట్టింది పేదరిక కుటుంబంలోనే. తండ్రి పాటల వారసత్వమే నాగన్నకు అబ్బింది. సాంస్కృతిక కళలంటే నాగన్నకు ప్రాణం. ఆ రక్తంలోనే ఆ వాసనలున్నయి కాబట్టే ఎక్కడ బాగోతం జరిగినా, జానపద కళారూపాల ప్రదర్శలిస్తున్నా కాలికి పనిచెప్పేవాడు. కోలాటం ఆడినా, ఒగ్గుకథ చెప్పినా నాగన్నకు ఆయనే సాటి. నాగన్న కళాసంపత్తి ఒక్క పాటరాయడం దగ్గరే ఆగలేదు. బాగోతాలు, శారద, పిచ్చకుంట్ల బుర్రకథలు, పొడపత్ర, బైకాళి, ఒగ్గు కథలతో బాటు, ఉపకుల వృత్తుల కళారూపాలు కూడా ప్రదర్శించేవాడు. నాగన్న ఉత్సాహానికి ఊపిరిలూదిన కళాకారుడు కానూరి వెంకటేశ్వర్ రావు. ఆయనే తనకు స్పూర్తి అని చెప్పుకుంటడు నాగన్న..
స్పాట్
నాగన్న పాటను ముందు ఊరే హత్తుకుంది. వ్యవసాయ పనుల్లో తన పాటలతో రైతుల్లో చైతన్యం కలిగించేందుకు ప్రత్నించేవాడు. చేలు చెలకలు, పైరగాలులు నాగన్న పాటకు తాళం వేసేవని చెప్పుకుంటరు. నాగన్నపాటల్లో అణిచి వేతను ప్రశ్నించే నాదముంటది. తిరగబడమనే నినాదముంటది. 1975 నుంచి విప్లవ గీతాలను ఆలపిస్తూ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నడు. ఎమర్జెన్సీ సమయంలో కూడా అనేక సార్లు అరెస్టయి జైలు జీవితాన్నిగడిపిండు నాగన్న. అరుణోదయ సాంస్కృతిక సంస్థలో కీలక పాత్ర పోషిస్తూ రాష్ర్టవ్యాప్తంగా అనేక ప్రదర్శనలిచ్చి ప్రజాచైతన్యం కోసం పాటుబడ్డడు. అన్నామరుడురా మన రామనరసయ్య అన్నపాట నాగన్నకు రాష్ర్టస్థాయి గుర్తింపు తెచ్చింది.
స్పాట్
నాగన్న బుర్ర కథలు చెప్పడంలో, భూబాగోతాలు ఆడటంలో సిద్దహస్తుడు. నాగన్న ఉద్యమించని ప్రజా సమస్యలేదు. మద్యనిషేదం, బూటకపు ఎన్కౌంటర్లు, విద్యుత్ చార్జీలు, తెలంగాణపోరాటం వంటి అనేక ఉద్యమాల్లో కీలక పాత్రపోషించిండు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో నాగన్న గజ్జకట్టి గళమెత్తి ఊరూవాడా తిరిగిండు. ధూంధాం ల ద్వారా తెలంగాణ పల్లెపల్లెనా చైతన్యం తెచ్చి మన తెలంగాణ మనకు వచ్చేదాకా విశ్రమించేది లేదని నినదించిండు. నాగన్న పాటలు అశేషప్రజానికం చేత ఆదరించబడ్డయి. అందుకే ఆర్ నారాయణ మూర్తి తన సినమాల్లో నాగన్నపాటలను జోడించిండు. చలో అసెంబ్లీ, దండోర చిత్రాలలో నాగన్న రాసిన పాటలు పల్లెపల్లెనా ఉద్యమ పరిమళాలు వెదజల్లినయి..అవే స్వరాలు తెలంగాణ ఉద్యమంలో ప్రవహిస్తున్నయి.
స్పాట్(ఇక్కణ్నుంచి వెంకన్న)
ఎల్ వెంకన్న...కలాన్ని గళాన్ని నమ్ముకున్న పల్లెపాటల విలుకాడు పుట్టింది నల్లగొండ జిల్లా నూతన్ కల్ మండలం ఎర్రపహాడ్ గ్రామం. తల్లి వెంకటమ్మ, తండ్రి నాగయ్య. స్కూల్ స్థాయిలోనే విద్యార్ధి ఉద్యమంలో పాల్గొన్నడు. అదే పంథా నేటికీ కొనసాగిస్తున్నడు. 1986నుంచి అరుణోదయ సాంస్కృతిక సంస్థలో చురుకుగా పని చేస్తున్న వెంకన్న ఇప్పటికి ఎన్నోపాటలు రాసిండు. వెంకన్నపాటలకు జానపద కళారూపాలే ఆయువు పోసినయి. ఆయన రాసిన ప్రతి పాటా పల్లె ప్రజల గుండెసడిని వినిపిస్తది. దగాపడ్డ తమ్ముళ్లు, చెరచబడ్డ చెల్లెళ్లు, దోపిడి గురైన రైతులు, ఆక్రందించిన అడవిబిడ్డలు. ఒకటేమిటి వెంకన్నతడమని సమస్యలేదు. రాయని గీతం లేదు. వెంకన్నరాసిన ఎల్లియాలో ఎల్లన్న అనే పాట ఆయనకు రాష్ర్టస్థాయి గుర్తింపునిచ్చింది. వెంకన్నపాటలు ఎన్నో ఆడియో సిడిలలో ఇమిడి పోయి ఇంటింటా సుప్రబాతాలయినయి. తన మొదటి సిడి చక్కాని నా పల్లె ఎంతో ఆధరణ పొందింది. ఆ తరువాత ఎన్నో పాటలు తన కలం నుండి ఒక ప్రవాహంలా వస్తూనే ఉన్నయి. తెలంగాణ ఉద్యమంలో వెంకన్న కీలక పాత్రమరువలేనిది. ఆయన తన ఆట పాట ద్వారా ప్రజలను చైతన్యం చేస్తూ ఒక పాత్రికేయునిగా ప్రపంచానికి తన పలుకులు వినిసిస్తున్నడు వెంకన్న.
స్పాట్
పల్లెపాటల ద్వారా, ఉద్యమగీతాల ద్వారా మరుగున పడ్డ మన సంస్కృతిని బతికిస్తున్న నాగన్న వెంకన్న లాంటి కళాకారులు మనకు సాంస్కృతిక వారసత్యం ఇస్తున్నరు. ఇగిరిపోతున్న ఉపవృత్తుల కళారూపాలను, జానపదకళలను బతికించుకోవాలంటే మనకు మరింత మంది నాగన్నలు వెంకన్నలే కాదు..కొత్త వారు పుట్టుకురావాలి. వారికి స్పూర్తి నిచ్చేదే ఈనాటి ఎవర్ ష్యూర్ మాటా ముచ్చట.

తెలంగాణ సిద్దాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్

యాంకర్
ఆచార్య కొత్తపల్లి జయశంకర్.. తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. తెలంగాణ బిడ్డలు తరాల సంది పడుతున్న తండ్లాటను కండ్లార చూసి చలించిన మేథావి. ఆయన పుట్టింది పోరాటాల పురిటిగడ్డ వరంగల్ జిల్లా అక్కంపేట గ్రామం..ఈ బుద్దిశాలిని కన్న ధన్యజీవులు లక్ష్మీకాంతారావు, మహాలక్ష్మి. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన జయశంకర్ బడుగు జీవుల బతుకు దెరువులను అతి దగ్గరనుంచి గమనించిండు..అందుకే ఆయన తొలి అడుగు నుంచి నేటి వరకు దగా పడ్డ బతుకులకు బాసటగా నిలిచిండు.
స్పాట్
జయశంకర్ ప్రస్థానం ఉపాధ్యాయ వృత్తితో మొదలయింది.. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, హైదరాబాద్ జిల్లాలలో టీచర్ గా పనిచేసిన్రు. తెలంగాణ అన్ని జిల్లాలతో ఆయనకు అనుబంధం ఉంది..ఉపాధ్యాయ వృత్తినుంచే అంచలంచలుగా లెక్చరర్ గా, ప్రొఫెసర్ గా ఎదిగిండు. అంతేకాక సీఫెల్, కాకతీయ యూనివర్సిటీ లకు రిజిస్ర్టార్ గా పనిచేసిన్రు. 1991 నుంచి 1994వరకు కాకతీయ యూనివర్సిటీకి వైస్ చాన్స్ లర్ గా బాధ్యతలు నిర్వహించిన్రు. ప్రధాని మన్మోహన్ సింగ్ జయశంకర్ గారి ప్రతిభను గుర్తించి 2004లో జాతీయ అసంఘటిత రంగ కమీషన్ కు లో నియమించిండు. తరువాత కాలంలో ఆపదవికి తనే స్వచ్ఛందంగా రాజీనామా చేసిండు.
స్పాట్
జయశంకర్ గారు తెలంగాణ ఎట్ల కన్నీళ్లు పెడుతున్నదో దగ్గర్నుంచి చూసిన్రు. తరగతి గదులకే పరిమితం కాలేదు. తెలంగాణ బిడ్డలు పడుతున్న కడగండ్లకు కారణమేంటో విప్పిచెప్పిండు.. తెలంగాణ బిడ్డలను ఎట్ల ధోకా చేస్తున్నరో తెలిపిండు. ఆయన అనుభవాలు వందల పిహెచ్ డిలతో సమానం..ఆయన స్పృషించని అంశంలేదు.. తెలంగాణ బిడ్డల యాతనకు మూలాలను శోధించిండు. నీళ్లల్లో, నిధులల్లో, ఉద్యోగాలలో సీమాంధ్ర నాయకులు ఎట్ల మోసపుచ్చుతున్నరో తెలిపిండు. తెలంగాణ సంస్కృతి పైనా, బాష పైన దాడెట్ల జరుగుతుందో అక్షరీకరించింన్రు.. ఆయన రాసిన తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, తెలంగాణ విస్త్రుత అంగీకారం, తెలంగాణలో ఏమి జరుగుతుంది వంటి పుస్తకాలలో తెలంగాణ గతం, వర్తమానం కనిపిస్తయి.
స్పాట్
తెలంగాణ విముక్తి కొరకు జయశంకర్ గారు చేసిన సేవలు మరువలేనివి.. ఆయన చేసిన మేథోశ్రమ నభూతో నభవిష్యతి.. విద్యార్ధిగా ఉన్నపుడే 1952లో నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నడు. 1954లో ఫజల్ అలీ కమీషన్ ముందు తెలంగాణ నుప్రత్యేక రాష్ర్టంగా ఉంచాలని వాదించిన్రు. 1955 -56 మద్యకాలంలో విశాలాంధ్ర వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నరు. 1968-69లలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రపోషించిన్రు. తెలంగాణ కోసం పనిచేసే ప్రతి శక్తిని కలుపుకోవాలని పిలుపునిచ్చిండు..
స్పాట్..
1969-1996 మధ్య కాలంలో తెలంగాణ కోసం పని చేసే సంఘాలకు, వ్యక్తులకు పెద్దదిక్కుగా నిలిచిండు. 1997లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పురుడు పోసుకున్న తెలంగాణ ఐక్య వేదిక ద్వారా ప్రత్యక్షంగా నాయకత్వ బాధ్యతలు చేపట్టి, నాలుగేండ్లుగా ఉద్యమాన్ని నడిపించిన్రు. తెలంగాణ రాష్ర్ట సమితి ఆవిర్భావ దశలోనాయకత్వాన్ని, కార్యకర్తలను, చైతన్యం పరచడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఆర్ యస్ యు నుంచి ఆర్ యస్ యస్ వరకు తెలంగాణ కోసం ఎవరు పిలిచినా అరమరికలు లేకుండా ఉద్యమ సభల్లో పాల్గొని తన గొంతు వినిపించేవారు.
స్పాట్
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న దశలో.. తెలంగాణ ఉద్యమ సారధి కేసిఆర్ గారికి వెన్నుదన్నుగా ఉంటూ ..యావద్భారత రాజకీయ ప్రముఖుల మద్దతు కూడ గట్టడంలో ముఖ్యపాత్రపోషించిన్రు జయశంకర్ గారు. తెలంగాణ రాష్ర్ట సమితి అధినేత కేసిఆర్ గారే జయశంకర్ గారిని తన గురువుగా భావిస్తరు. ఎందుకంటే 2004 సంవత్సరం నుంచి 2009 నవంబర్ 9 న తెలంగాణ రాష్ర్ట ప్రకటన వెలువడే వరకు అందరు నాయకులను కలిసి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు ఒప్పించడంలో కేసిఆర్ గారితో బాటు ముఖ్యపాత్ర పోషించిన్రు. మూడు తరాల కడగండ్లను కండ్లార చూసిన సామాజికవేత్త. తెలంగాణలో ప్రతి విషయాన్ని కండ్లకు కట్టినట్టు వివరించిన్రు. అందుకే ఆయనను మీడియా తెలంగాణ సిద్దాంత కర్త అని అభివర్ణించడం అక్షరాలా నిజమే.. నిజాయితీ గల సిద్దాంతకారుడికి నిలువెత్తు నిదర్శనం జయశంకర్ గారు..

జడల రమేష్ జానపద గాయకుడు

ఎ. జనార్ధన్
తెలంగాణ మట్టిలో జానపద గీతాలు జలపాతల్లా జలజలా రాలి పడతయి. పల్లె జనం ఆ జానపద జల్లుల్లో తడిసి పులకిస్తది. ఆ పదాలను తన పెదాలపై అలవోకగా ఆడించగల పల్లెగాయకుడు జడల రమేష్.. పుట్టింది కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. తండ్రి రాజవీరు, తల్లి కళావతి. భార్య తేజస్విని, పిల్లలు అపూర్వ, వర్షిత్. బతుకు బాటకు నేత వృత్తిని, బతుకు పాటకు జానపదాన్ని ఎంచుకున్నడు రమేష్..
స్పాట్
రమేష్ .. కండెలు చుట్టడం, సాంచెలు నడపడం అలవోకగా చేయగలడు. ఉగ్గుపాలతో నేర్చుకున్న మగ్గం విద్య ఊరికొయ్యలకు ఎలా పంపుతుందో పాటగట్టిండు. సిరులొలికే సిరిసిల్ల ఉరిసిల ఎలా అయిందో తన పాటలల్లో వివరించిండు. నేతకార్మికుల కష్టాలన్నీ తన పాటల్లో పొదిగిండు. తానే ఖర్చు భరించి నేత బతుకుల పై ఒక ఆడియో సిడి విడుదల చేసిండు. ఇప్పటికి రెండు వేల క్యాసెట్లలో పాడిండు. 5వేల పాటలు పాడిండు. 7 భాషల్లో తన గళమాధుర్యాన్ని నింపిండు.
స్పాట్
ప్రజా కళాకారుడిగా అనేక ప్రజాచైతన్య సభల్లో పాల్గొని ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రయత్నించిండు. మొదటి పాట సిరిసిల్ల ఫ్రెండ్స్ ఆర్కెస్ర్టాలో పాడి తన సత్తా చాటిండు. అనేక ధూంధాం సభల్లో పాల్గొన్నడు. ఆద్యాత్మిక కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటడు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పొషించిండు జడల రమేష్. ఈయన నైపుణ్యానికి ప్రజల నుంచి మంచి ఆధరణ లభించింది. వేములవాడ దేవస్థానం నుంచి ఉత్తమగాయకుడి అవార్డు అందుకున్నడు. హైదరాబాద్ పాత బస్తీలో నిర్వహించిన కచేరీలో వచ్చిన గుర్తింపుకు వెండి కిరీటం బహుకరించిన్రు. కరీంనగర్ లో జరిగన స్వదేశీ జగరణ్ మేళలో జానపద కవిగాయక శిఖామణి అన్నబిరుదునిచ్చి సన్మానం చేసిన్రు. తెలంగాణ బాషలో రామాయణాన్ని రాసి పాడి అమ్మనేనుబోతున్నలంకలోకి పేరుతో వీడియో సిడి చేసిన్రు. ఈ కాసెట్ బహుళ ప్రజాదరణ పొందింది.

స్పాట్
రమేష్ కు నటనలో కూడా మంచి అనుభవం కలదు. అనేక డాక్యుమెంటరీలలో నటించిండు. వివిధ రకాల కళారూపాలలో, నృత్యరూపకాలలో ఆడిపాడిండు.. ప్రజా సేవే తన లక్ష్యమని, పాటద్వారా ప్రజలను చైతన్యం చేస్తనని సగర్వంగా చెప్పుకుంటడు జడల రమేష్.

ఒగ్గు కథకు జీవం చుక్క సత్తెయ్య

ఎ.జనార్ధన్
స్పాట్
తెలంగాణ కళారూపాలలో ఒగ్గుకథకు ప్రత్యేక స్థానం ఉంది.. పల్లెలల్లో ఎనకటి వాళ్లకు వినోదాన్ని విజ్ఞానాన్ని పంచేది ఒగ్గుకథలే.. ఒగ్గుకథలు, బాగోతాలు, బుర్రకథలు, వీధి నాటకాలు ఇవ్వన్నీ అక్కచెల్లెండ్లే. ఇప్పడు డిజిటల్ మాయాజాలం కండ్లవడ్డంక ఈ ఒగ్గు కథలను బొగ్గుల్లో కలిన్రు. అయినా నేటికీ ఆ ఒగ్గు కథను నమ్ముకొని జీవించడమే కాదు.. ఆ ఒగ్గు కథకు జీవం పోస్తున్న కళాకారులు ఎందరో ఉన్నరు. అటువంటి కళాకారుల్లో పేరువడ్డ ఒగ్గుకథకుడే చుక్క సత్తెయ్య ..
స్పాట్
చుక్క సత్తెయ్య పుట్టింది వరంగల్ జిల్లా, లింగాల ఘనపురం మండలం, మాణిక్యాపురం గ్రామం. ఒగ్గుకథలు చెప్పుడు సత్తెయ్యకు వారసత్వంగా వచ్చిందే. సత్తెయ్య కు తండ్రి ఒగ్గుకథ నేర్పిండు. అల్లీరాణీ కథలు అలవోకగా వల్లెవేయగలడు సత్తేయ్య. అంతే కాదు కులపురాణాలు, వీధి భాగోతం ఆయన నాలుకపై నాట్యమాడుతుంటయి.
స్పాట్
చుక్క సత్తెయ్య ఒగ్గుకథ చెప్పుడేందని ఎంతో మంది ఎదురు తిరిగిన్రు. చెప్పొద్దని అడ్డుకున్నరు. కానీ ఆయన కాలు ఆగలే. ఎట్లయితే అట్లయిందని ఎదురు నిలిచిండు. అడ్డు పడ్డోల్ల అడ్రసయితే లేదుగాని ఒగ్గుకథకు ఇప్పుడు సత్తేయ్యే అడ్రసయిండు. ఆయన ఆడని ఆటలేదు. పాడని పాటలేదు. ఇప్పుడొస్తున్న ఎన్నోపాటలకు ప్రాణం ఒగ్గుకథలల్లనే ఉన్నదంటడు సత్తెయ్య.
స్పాట్
తన తండ్రి దగ్గర్నుంచి ఒగ్గుకథలు చెప్పుడు నేర్బుకున్న సత్తేయ్య.. 16 ఏండ్ల సందే కథ చెప్పుడు షురు చేసిండు. తాను కథ చెప్పుడు మొదలేస్తే కూసున్నోళ్లు కథ అయిందనక లేవరంటడు సత్తెయ్య. అంత సక్కంగ చెప్పవట్టే సత్తెయ్య కథ దేశమంతా పాకింది. మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, కర్ణాటక, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ప్రదేశ్, కేరళ, తేజాపూర్, పాండిచ్చేరి రాష్ర్టాలలో మన ఒగ్గు కథ రుచి చూపించిండు సత్తెయ్య. ఒక్క ఢిల్లీలోనే ఇప్పటికి 26 సార్లు ఒగ్గు కథ చెప్పిండు. 1973 నుంచి ఇప్పటి వరకు ఢిల్లో ఒగ్గుగొంతు వినిపిస్తనే ఉండు. ఏ ఏటికాయేడు తన కథ కొత్తగనే ఉంటదంటడు సత్తెయ్య. అందుకనే ప్రతి యేడు తనను ఢిల్లీ పిలుచుకపోయి కథ చెప్పిస్తరని సగర్వంగా చెప్పుకుంటడు.
స్పాట్
ఒగ్గుకథ నమ్ముకొని జీవిస్తున్న ఈ కళామతల్లి ముద్దుబిడ్డ ఎందరో కళాకారులను తీర్చి దిద్దిండు. ఈయన కృషిని మెచ్చి ఇప్పటి వరకు అనేక మంది ముఖ్యమంత్రులు సత్కరించి సన్మానించిన్రు. రాష్ర్టపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా సాహిత్య అకాడమీ అవార్డునందుకున్నడు. కళాసాగర్ అవార్డు కూడా ఈయనను వరించింది. ఇక సన్మానాలు సత్కారాలకు కొదవే లేదు. 20 ఏండ్ల సంది తెలుగు యూనివర్సిటీ లో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్ధులకు ఒగ్గుకథ గురించి పాఠాలు నేర్పుతున్నడు.
స్పాట్
1931లో జన్మించిన ఈ తెలంగాణా కళామతల్లి ముద్దుబిడ్డ చేయని పోరు లేదు. తెలంగాణ బిడ్డల ఎతలు కండ్లార జూసిండు గనుకనే బడిత బట్టిండు. తెలంగాణ సాయుధ పోరాటంలో దూకిండు. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నడు. 80 ఏండ్ల పై బడ్డా కూడా ఉద్యమాల పాటలు హుషారుగా పాడుతడు. అదే గొంతు వినిపిస్తడు.

ఒగ్గు కథకు జీవం చుక్క సత్తెయ్య

ఎ.జనార్ధన్
స్పాట్
తెలంగాణ కళారూపాలలో ఒగ్గుకథకు ప్రత్యేక స్థానం ఉంది.. పల్లెలల్లో ఎనకటి వాళ్లకు వినోదాన్ని విజ్ఞానాన్ని పంచేది ఒగ్గుకథలే.. ఒగ్గుకథలు, బాగోతాలు, బుర్రకథలు, వీధి నాటకాలు ఇవ్వన్నీ అక్కచెల్లెండ్లే. ఇప్పడు డిజిటల్ మాయాజాలం కండ్లవడ్డంక ఈ ఒగ్గు కథలను బొగ్గుల్లో కలిన్రు. అయినా నేటికీ ఆ ఒగ్గు కథను నమ్ముకొని జీవించడమే కాదు.. ఆ ఒగ్గు కథకు జీవం పోస్తున్న కళాకారులు ఎందరో ఉన్నరు. అటువంటి కళాకారుల్లో పేరువడ్డ ఒగ్గుకథకుడే చుక్క సత్తెయ్య ..
స్పాట్
చుక్క సత్తెయ్య పుట్టింది వరంగల్ జిల్లా, లింగాల ఘనపురం మండలం, మాణిక్యాపురం గ్రామం. ఒగ్గుకథలు చెప్పుడు సత్తెయ్యకు వారసత్వంగా వచ్చిందే. సత్తెయ్య కు తండ్రి ఒగ్గుకథ నేర్పిండు. అల్లీరాణీ కథలు అలవోకగా వల్లెవేయగలడు సత్తేయ్య. అంతే కాదు కులపురాణాలు, వీధి భాగోతం ఆయన నాలుకపై నాట్యమాడుతుంటయి.
స్పాట్
చుక్క సత్తెయ్య ఒగ్గుకథ చెప్పుడేందని ఎంతో మంది ఎదురు తిరిగిన్రు. చెప్పొద్దని అడ్డుకున్నరు. కానీ ఆయన కాలు ఆగలే. ఎట్లయితే అట్లయిందని ఎదురు నిలిచిండు. అడ్డు పడ్డోల్ల అడ్రసయితే లేదుగాని ఒగ్గుకథకు ఇప్పుడు సత్తేయ్యే అడ్రసయిండు. ఆయన ఆడని ఆటలేదు. పాడని పాటలేదు. ఇప్పుడొస్తున్న ఎన్నోపాటలకు ప్రాణం ఒగ్గుకథలల్లనే ఉన్నదంటడు సత్తెయ్య.
స్పాట్
తన తండ్రి దగ్గర్నుంచి ఒగ్గుకథలు చెప్పుడు నేర్బుకున్న సత్తేయ్య.. 16 ఏండ్ల సందే కథ చెప్పుడు షురు చేసిండు. తాను కథ చెప్పుడు మొదలేస్తే కూసున్నోళ్లు కథ అయిందనక లేవరంటడు సత్తెయ్య. అంత సక్కంగ చెప్పవట్టే సత్తెయ్య కథ దేశమంతా పాకింది. మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, కర్ణాటక, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ప్రదేశ్, కేరళ, తేజాపూర్, పాండిచ్చేరి రాష్ర్టాలలో మన ఒగ్గు కథ రుచి చూపించిండు సత్తెయ్య. ఒక్క ఢిల్లీలోనే ఇప్పటికి 26 సార్లు ఒగ్గు కథ చెప్పిండు. 1973 నుంచి ఇప్పటి వరకు ఢిల్లో ఒగ్గుగొంతు వినిపిస్తనే ఉండు. ఏ ఏటికాయేడు తన కథ కొత్తగనే ఉంటదంటడు సత్తెయ్య. అందుకనే ప్రతి యేడు తనను ఢిల్లీ పిలుచుకపోయి కథ చెప్పిస్తరని సగర్వంగా చెప్పుకుంటడు.
స్పాట్
ఒగ్గుకథ నమ్ముకొని జీవిస్తున్న ఈ కళామతల్లి ముద్దుబిడ్డ ఎందరో కళాకారులను తీర్చి దిద్దిండు. ఈయన కృషిని మెచ్చి ఇప్పటి వరకు అనేక మంది ముఖ్యమంత్రులు సత్కరించి సన్మానించిన్రు. రాష్ర్టపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా సాహిత్య అకాడమీ అవార్డునందుకున్నడు. కళాసాగర్ అవార్డు కూడా ఈయనను వరించింది. ఇక సన్మానాలు సత్కారాలకు కొదవే లేదు. 20 ఏండ్ల సంది తెలుగు యూనివర్సిటీ లో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్ధులకు ఒగ్గుకథ గురించి పాఠాలు నేర్పుతున్నడు.
స్పాట్
1931లో జన్మించిన ఈ తెలంగాణా కళామతల్లి ముద్దుబిడ్డ చేయని పోరు లేదు. తెలంగాణ బిడ్డల ఎతలు కండ్లార జూసిండు గనుకనే బడిత బట్టిండు. తెలంగాణ సాయుధ పోరాటంలో దూకిండు. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నడు. 80 ఏండ్ల పై బడ్డా కూడా ఉద్యమాల పాటలు హుషారుగా పాడుతడు. అదే గొంతు వినిపిస్తడు.

చక్రి మ్యూజిక్ డైరక్టర్

ఎ. జనార్ధన్
తెలంగాణ కళావనంలో గుభాళించిన ఓ స్వర పరిమళం. ఉవ్వెత్తున ఎగసిపడే స్వరఝరి.. సర్వగమకాలను తన స్వరంలోకి ఆవహించిన తెలంగాణ గాన గంధర్వుడు. ఆయనే మన స్వరతరంగం చక్రి.
స్పాట్
సినీ సంగీత వినీలాకాశంలో అత్యంత తక్కువ సమయంలో తారాజువ్వలా దూసుకుపోయిన చక్రి పుట్టింది … ఉద్యమాల పురిటిగడ్డ మహబూబాబాద్.. తల్లి విద్యావతి, తండ్రి వెంకటనారాయణ. బాల్యమంతా సొంత గడ్డపైనే గడిచింది.. చక్రికి సంగీతం ఉగ్గుపాలతోనే అబ్బింది. అమ్మలాలి పాటలు నాన్నా జోల పాటలు చక్రికి సంగీతపు వారసత్వాన్నిచ్చినయి. తండ్రి వెంకటనారాయణ మంచి గాయకుడు, కంపోజర్. అదే వారసత్వాన్ని పుణికిపుచ్చుకుండు చక్రి. మహబూబాబాద్ లో స్కూల్ విద్య పూర్తయినంక వరంగల్లో డిగ్రీ పూర్తి చేసిండు. చక్రి సోదరి “ఆదర్శిణి” కూడా మంచి గాయని, తమ్ముడు “మహిత” త్వరలో మ్యూజిక్ డైరక్టర్ గా పరిచయం కాబోతున్నడు. చక్రి శ్రావ్యమైన సంగీతానికి తోడుగా “శ్రావణి” జీవిత భాగస్వామిగా జతగూడింది. తాను వేసే ప్రతి అడుగు వెనకా తన కుంటుంభ సభ్యుల సహకారం మరువలేనిదని చెప్పుకుంటడు ఈ స్వరశిల్పి.
స్పాట్
చక్రికి చిన్నతనం నుంచే సంగీతమంటే చెప్పలేని అభిమానం. ఆయనకు పాటే ప్రాణం.. వరంగల్ లో డిగ్రీ చదివేటపుడే తన భవిష్యత్తుకు బాటలు వేసుకుండు. సినిమా ఫీల్డ్ లోకి రాక ముందే 40కి పైగా ఆల్బంలు చేసిండు. చల్లగాలి… చిరునవ్వుతో..వంటి ఆల్బంలు చక్రి మంచి పేరు తెచ్చినయి.
స్పాట్
చక్రి ప్రతిభను గుర్తించిన పూరి జగన్నాధ్ తొలిసారి “బాచి” చిత్రంలో సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చిండు. 2000వ సంవత్సరంలో మొదలైన ఆ ప్రస్థానం నేటికీ సాగర స్వరాల్లా సాగిపోతూనే ఉంది. ఆయన గళం నుంచి జాలువారిన గమకాలెన్నో పల్లెలల్లో సుప్రభాతాలై నిద్దుర లేపుతయి. బాచి నుంచి జైభోలో తెలంగాణ వరకు ఆయన స్వరపరచిన ఎన్నో గేయాలు నిత్య పరిమళ స్వర పుష్పాలై గుభాళిస్తున్నయి.. ఇప్పటి వరకు చక్రి దాదాపు 90 కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన్రు. ఒక్కతెలుగులోనే కాక ఇతర దక్షణాది బాషా చిత్రాలకు కూడా పనిచేసిన్రు. ఇట్లు శ్రావణి సుభ్రమణ్యం, ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి, సత్యం, చక్రం, జై భోలో తెలంగాణ వంటి చిత్రాలు ఆయన అందించిన వాడిపోని స్వరపారిజాతాలు.
స్పాట్
చక్రి తాను వచ్చిన దారిని ఎప్పటికీ మరిచిపోలేదు.. స్నేహానికి ప్రాణమిచ్చే చక్రికి.. తన చుట్టూ ఉన్నవాళ్లు కూడా సంతోషంగా ఉండాలను కునే మనస్థత్వం. ఎందరో నూతన గాయనీ గాయకులకు అవకాశమిచ్చి వారి ఎదుగుదలకు దారి చూపిండు. అంతేకాదు .. తన పుట్టిన రోజు వంటి స్పెషల్ అకేషన్స్ లో పేదవారికి పాలు పళ్లు పంచిపెట్టడం, బట్టలు కొనివ్వడం, అనాధలకు కావలసిన వస్తువులు అందివ్వడం, రక్త ధాన శిభిరాలు నిర్వహించడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తడు. తనను నమ్ముకొని వచ్చిన వారికి నేనున్నానని అండగా నిలుస్తడు. అందుకే ఆయన మిత్రులు.. చక్రికి బలం, బలహీనత ఆయన మంచితనమేనని చెప్తరు.
స్పాట్
చక్రి ప్రతిభను ఇండస్ట్రీ గుర్తించింది. ఆయన స్వరాలకు నీరాజనం పలికింది. సత్యం సినిమాలో “ ఓ మగువా నీతో స్నేహం కోసం “ పాటకు సౌత్ ఇండియా నుంచి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. ఇదే కాక శంకర్, జయకిషన్ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డులు ఆయన సొంతం చేసుకున్నరు. సంతోషం వంటి అవార్డలు కూడా ఆయన సరసన చేరి తమ విలువ పెంచుకున్నయి. స్వయం కృషితో ఎదిగి ప్రతిభను నమ్ముకున్న చక్రి తెలంగాణ బిడ్డ కావడం మనందరం గర్వించదగ్గ విషయం.
స్పాట్

గంగా స్వాతి జానపద గాయనిలు

ఎ. జనార్దన్
తెలంగాణ తనువంతా జానపదాల జాతరే..ఈ పాటల పల్లకికి బోయీలుగా మారిన ఎందరో కళాకారులు తెలంగాణ కళామతల్లికి ముద్దుబిడ్డలు. కళల కణాచి తెలంగాణ మట్టిలో పుట్టిన వారసత్వ గేయాలను ఒడిసి పట్టి ముందుతరాలకు మోస్తున్న జానపద కళాకారులలో వర్ధమాన గాయనిలు గంగ, స్వాతి. తమ ఫోక్ వాయిస్ తో ఇటు కళాభిమానుల చేత విమర్శకుల చేత ప్రశంసల జల్లులుఉ కురిపించుకున్న ఈ జోడు గళాలు గొంతెత్తితే పల్లెకోయిలలు సైతం పరవశించి పోతయి.
స్పాట్
గంగ..పుట్టింది నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ముల్లంగి గ్రామం. తండ్రి అంకుల మల్లయ్య, తల్లి సాయమ్మ. జాబిలమ్మను చూపి తినిపించే గోరుముద్దల తోనే అమ్మ జానపదాలు నేర్పింది. స్కూల్ స్థాయిలో పాటలు పాడి ప్రతి పోటీలో జానపదాలను ఆలపించడంలో తన మార్కు వేసుకుంది. గంగ గళమెత్తితే ఎంత పెద్ద సభకూడా గాలిచప్పుడు వినపడేంత నిశ్శబ్దంగా మారుతదని అభిమానులు చెప్పుకుంటరు. వాగ్దేవి డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండవ సంత్సరం చదువుతోంది.
స్పాట్
గంగ ఎంటర్ టైన్ మెంట్ చానళ్లలో, న్యూస్ చానళ్లలో మ్యూజికల్ ప్రోగ్రాంలలో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకొంది. మాటీవి నిర్వహించే రేలారే రేలా , సూపర్ సింగర్స్ కార్యక్రమాలలో ముందంజలో నిలిచింది. గంగ గళ మాధుర్యానికి పరవశించిన అనేక మంది ప్రముఖులు వివిధ జిల్లాలలో ప్రదర్శనలిప్పించిన్రు. తెలంగాణ ధూంధాంలలో ప్రదర్శనలిచ్చి ఉద్యమంలో తన వంతు పాత్రపోషించింది. 2007 నుంచి అనేక ప్రజా చైతన్య కార్యక్రమాలలో పాల్గొంటూ జానపదాలను జనబాహుళ్యంలోకి తీసువెళ్తున్నది గంగ.
స్పాట్
స్వాతి.. ఈ జానపదాల మధురగాయని పుట్టింది నల్లగొండ జిల్లా మోత్కూర్ మండలం అడ్డగూడూరు గ్రామం. తండ్రి పూర్ణయ్య తల్లి పుష్ప. డిగ్రీ వరకు చదువుకుంది. మల్టీ మీడియాలో ప్రవేశించిన స్వాతికి రేలా రె రేలా లో అవకాశం వచ్చింది. మొదటి ఎపిసోడ్తో మొదలైన ప్రస్థానం చివరి ఎపిసోడ్లో విజేతగా నిలిచే వరకు సాగింది. సూపర్ సింగర్స్లో కూడా తన సత్తా చాటింది. స్వాతి స్వరంలో జానపదాలు చేసే లయవిన్యాసం మాధుర్యం ఇంటి ఆడపడుచును గుర్తుకు తెస్తది. బతుక్మ పాటలు, ఉయ్యాల పాటలు ఆమె నోటినుంచి అలవోకగా జాలువారుతుంటయి. పల్లెపాటకు ప్రాణం పోస్తున్నస్వాతి వర్థమాన జానపద కళాకారులకు ఆదర్శంగా నిలుస్తుంది.తన తోటి కళాకారులను ప్రోత్సహిస్తుంది.

కొండయ్య. నత్తి సత్తి

ఎ. జనార్ధన్
వాయిస్
పల్లెదనాన్ని ఒళ్లంతా నింపుకొని పాదచారిలా, పాటచారిలా వెళుతున్న ఈ గ్రామీణ కళాకారుడి పేరు.కొండయ్య.. కొండయ్యది మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామం. తండ్రి రాములు, తల్లి సత్తెమ్మ. చిన్నతనం నుంచే పాట పాడటమంటే మహాసరదా.. పాట కొండయ్యకు వారసత్వం కాదు. ఈయన పాటలకు ప్రకృతే గురువు.. సంగీత పరిజ్ఞానం లేని కొండయ్య వినసొంపైన బాణీలు కట్టడంలో దిట్ట. అంతేకాదు.. ఆ బాణీలలో పల్లెతనాన్ని పలరించే పదాలను చిలకరించి కొత్త రూపం తెస్తడు కొండయ్య. అందుకే ఆయన పాటలు పల్లెపల్లెనా పల్లవించినయి. గొంగడి భుజాన వేసుకొని మూగజీవాలతో మనసులో మాటలు చెప్పుకునే కొండయ్యకు మొదటి ప్రేక్షకులు కూడా అవే.. కంజీరా చేతిలో పట్టుకొని గంగా ప్రవాహాల్లాంటి పాటలను పలికిస్తుంటే గోరువంకలు, చిలకమ్మలు కొండయ్య పాటకు కోరస్ పలుకుతయి.
స్పాట్( బ్యాగ్రౌండ్ ..చిలకమ్మ..చిలకమ్మా..)
జానపదాలంటే ప్రాణమిచ్చే కొండయ్య వాటికి ప్రాణం పోయాలని ఉబలాట పడ్డడు. కాలగర్బంలో కలిసిపోతున్న జానపదాలకు జీవంపోయాలని.. తాను ప్రాణంగా చూసుకొనే గొర్రెలనమ్మి ఆడియో సిడి చేసిండు. ఆ పాటలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది కానీ గొర్రెల మందను తిరిగి తెచ్చుకోలేని పేదరికం మాత్రం అట్లనే మిగిలింది. పేదరికంలో ఉండి కూడా పాటలను బతికించాలను కున్న కొండయ్య మరో ఆడియో సిడికి చేసేందుకు సిద్దపడుతున్నడు. కొండయ్య పాటలు పసిడి కొండల్లా పదికాలాల పాటు నిలవాలని కోరుకుంటున్నరు ఆయన అభిమానులు.
2వస్టోరీ.
వాయిస్
పాట పాడాలంటే మంచి స్వరం..చక్కని ఉచ్చారణ కావాలి అని అనుకుంటరు. కానీ అవేవీ లేకపోగా మాట మాట్లాడటమే కష్టంగా మారిన వ్యక్తి సత్యనారాయణ. మాటలు స్పష్టంగా మాట్లాడలేని నత్తి ఆయనకు శాపంగా మారింది. అయినా ఆయన పాటలు పాడాలన్న తన లక్ష్యాన్ని వదులు కోలేదు. వైకల్యాన్ని అధిగమించి పాటను సొంత చేసుకున్న సత్యనారాయణది మహబూబ్ నగర్ జిల్లా అమరచింత గ్రామం. ఇప్పడిక సత్యనారాయణ పాటల సత్తిగా అందరికీ చిరపరిచయం. పాటల సత్తిగా మారడానికి సత్యం పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీకావు. ఎందుకంటే సత్యనారాయణ పుట్టగానే గాయకుడు కాదు. తాపీ మేస్ర్తీ వృత్తి. అప్పుడప్పుడు పశువులు కాసుకునే వాడు. పశువులు కాసుకునే వాడికి పాటేంటని ఎగతాళి చేసిన్రు. అంతేకాదు మాటే సరిగా రాని సత్యానికి పాటకూడానా అని హేళన చేసిన్రు. ఆ మాటలు సత్యనారాయణలో మరింత బలాన్ని పెంచినయి. ఎలాగైనా పాట పాడి తీరాలనుకున్నడు. తనలో దాగిన కళను వెలికి తీసేందుకు కఠోర శ్రమ చేసిండు. ఖాళీ సమయాల్లో పాట ప్రాక్టీస్ చేసిండు. ఆయన చేసిన శ్రమ ఫలితంగా నేడు ఆయన ఇంటి పేరే పాటగా మారింది. ఒకప్పుడు నత్తి సత్తి అన్నవాళ్లే నేడు కత్తిలాంటి పాటల సత్తి అంటున్నరు. అయినా గతాన్ని తవ్వి గుర్తుచేసుకొనే ఓపికా, తీరికా సత్యానికి లేదు. ఎందుకంటే తన ఏరియాలో ఎక్కడ ధూంధాం జరిగినా.. మీటింగులు జరిగినా మొదటి పాట సత్యానిదే..వైకాల్యాన్ని అధిగమించి కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్న సూత్రానికి సత్యమే ప్రత్యక్ష నిదర్శనం.
స్పాట్

కందికొండ

ఎ. జనార్ధన్
నవరసాలూరించే పాటలు రాయడమంటే అంత తేలిక కాదు. రాసిన ప్రతి పాటా ఆడియన్స్ నోళ్లలో నానించడమూ అంత ఈజీ కాదు. కానీ రాసిన ప్రతి పాటనూ ఒక కోటగా మార్చిన ఘనత కందికొండది.
స్పాట్
సినీ ఫీల్డ్ లో, తన సొంత గ్రామం వారికి తప్ప ఇంత చక్కని స్వరాలూరించే పాటలు రాసిన కందికొండ గురించి చాలా మందికి తెలియదు. మళ్ళి కూయవే గువ్వా పాట తెలియని సంగీతాభిమాని లేడు. అంతేకాదు గలగల పారుతున్నగోదిరిలా పాట హమ్మింగ్ చేయని వారుండరు. కానీ ఈ పాటలకు ప్రాణం పోసిన కవి కందికొండ.
స్పాట్
కందికొండ పుట్టింది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగూర్లపల్లి గ్రామం. ప్రాథమిక విద్య సొంతూర్లో పూర్తయింది. డిగ్రీ వరకు మహబూబా బాద్ లో చదువుకున్నరు. యం.ఎ తెలుగు లిటరేచర్ పూర్తి చేసి యం.ఎ పొలిటికల్ సైన్స్ చదువుతున్నరు.
స్పాట్
కందికొండ తాను చదువుకునే రోజుల నుంచే పాటలు రాయడం నేర్చుకుండు. మొదట్లో జానపద గీతాలు రాస్తున్న కందికొండకు సినీ సంగీత దర్శకుడు చక్రి సాన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపిండు. చక్రి సంగీత దర్శకత్వంలో తొలిసారిగా ఇట్లు శ్రావణి సుభ్రమణ్యం. చిత్రంలో మళ్లి కూయవే గువ్వా పాటరాసి తానేంటో నిరూపించుకున్నడు.
స్పాట్( మళ్లి కూయవే గువ్వా పాట)
ఈ పాట తరువాత కందికొండ వెనకడుగు వేసింది లేదు. పాట వెంట పాట పందిరిలా సినీ సంగీతాభిమానులను అల్లుకుపోయినయి. తన చాలా పాటలకు ప్రాణం పోసింది చక్రియే నని, తానింతటి వాడు కావడానికి తనను ప్రోత్సహించింది చక్రీ అని వినమ్రంగా చెప్పుకుంటడు.
స్పాట్