29, ఏప్రిల్ 2011, శుక్రవారం

జడల రమేష్ జానపద గాయకుడు

ఎ. జనార్ధన్
తెలంగాణ మట్టిలో జానపద గీతాలు జలపాతల్లా జలజలా రాలి పడతయి. పల్లె జనం ఆ జానపద జల్లుల్లో తడిసి పులకిస్తది. ఆ పదాలను తన పెదాలపై అలవోకగా ఆడించగల పల్లెగాయకుడు జడల రమేష్.. పుట్టింది కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. తండ్రి రాజవీరు, తల్లి కళావతి. భార్య తేజస్విని, పిల్లలు అపూర్వ, వర్షిత్. బతుకు బాటకు నేత వృత్తిని, బతుకు పాటకు జానపదాన్ని ఎంచుకున్నడు రమేష్..
స్పాట్
రమేష్ .. కండెలు చుట్టడం, సాంచెలు నడపడం అలవోకగా చేయగలడు. ఉగ్గుపాలతో నేర్చుకున్న మగ్గం విద్య ఊరికొయ్యలకు ఎలా పంపుతుందో పాటగట్టిండు. సిరులొలికే సిరిసిల్ల ఉరిసిల ఎలా అయిందో తన పాటలల్లో వివరించిండు. నేతకార్మికుల కష్టాలన్నీ తన పాటల్లో పొదిగిండు. తానే ఖర్చు భరించి నేత బతుకుల పై ఒక ఆడియో సిడి విడుదల చేసిండు. ఇప్పటికి రెండు వేల క్యాసెట్లలో పాడిండు. 5వేల పాటలు పాడిండు. 7 భాషల్లో తన గళమాధుర్యాన్ని నింపిండు.
స్పాట్
ప్రజా కళాకారుడిగా అనేక ప్రజాచైతన్య సభల్లో పాల్గొని ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రయత్నించిండు. మొదటి పాట సిరిసిల్ల ఫ్రెండ్స్ ఆర్కెస్ర్టాలో పాడి తన సత్తా చాటిండు. అనేక ధూంధాం సభల్లో పాల్గొన్నడు. ఆద్యాత్మిక కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటడు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పొషించిండు జడల రమేష్. ఈయన నైపుణ్యానికి ప్రజల నుంచి మంచి ఆధరణ లభించింది. వేములవాడ దేవస్థానం నుంచి ఉత్తమగాయకుడి అవార్డు అందుకున్నడు. హైదరాబాద్ పాత బస్తీలో నిర్వహించిన కచేరీలో వచ్చిన గుర్తింపుకు వెండి కిరీటం బహుకరించిన్రు. కరీంనగర్ లో జరిగన స్వదేశీ జగరణ్ మేళలో జానపద కవిగాయక శిఖామణి అన్నబిరుదునిచ్చి సన్మానం చేసిన్రు. తెలంగాణ బాషలో రామాయణాన్ని రాసి పాడి అమ్మనేనుబోతున్నలంకలోకి పేరుతో వీడియో సిడి చేసిన్రు. ఈ కాసెట్ బహుళ ప్రజాదరణ పొందింది.

స్పాట్
రమేష్ కు నటనలో కూడా మంచి అనుభవం కలదు. అనేక డాక్యుమెంటరీలలో నటించిండు. వివిధ రకాల కళారూపాలలో, నృత్యరూపకాలలో ఆడిపాడిండు.. ప్రజా సేవే తన లక్ష్యమని, పాటద్వారా ప్రజలను చైతన్యం చేస్తనని సగర్వంగా చెప్పుకుంటడు జడల రమేష్.

ఒగ్గు కథకు జీవం చుక్క సత్తెయ్య

ఎ.జనార్ధన్
స్పాట్
తెలంగాణ కళారూపాలలో ఒగ్గుకథకు ప్రత్యేక స్థానం ఉంది.. పల్లెలల్లో ఎనకటి వాళ్లకు వినోదాన్ని విజ్ఞానాన్ని పంచేది ఒగ్గుకథలే.. ఒగ్గుకథలు, బాగోతాలు, బుర్రకథలు, వీధి నాటకాలు ఇవ్వన్నీ అక్కచెల్లెండ్లే. ఇప్పడు డిజిటల్ మాయాజాలం కండ్లవడ్డంక ఈ ఒగ్గు కథలను బొగ్గుల్లో కలిన్రు. అయినా నేటికీ ఆ ఒగ్గు కథను నమ్ముకొని జీవించడమే కాదు.. ఆ ఒగ్గు కథకు జీవం పోస్తున్న కళాకారులు ఎందరో ఉన్నరు. అటువంటి కళాకారుల్లో పేరువడ్డ ఒగ్గుకథకుడే చుక్క సత్తెయ్య ..
స్పాట్
చుక్క సత్తెయ్య పుట్టింది వరంగల్ జిల్లా, లింగాల ఘనపురం మండలం, మాణిక్యాపురం గ్రామం. ఒగ్గుకథలు చెప్పుడు సత్తెయ్యకు వారసత్వంగా వచ్చిందే. సత్తెయ్య కు తండ్రి ఒగ్గుకథ నేర్పిండు. అల్లీరాణీ కథలు అలవోకగా వల్లెవేయగలడు సత్తేయ్య. అంతే కాదు కులపురాణాలు, వీధి భాగోతం ఆయన నాలుకపై నాట్యమాడుతుంటయి.
స్పాట్
చుక్క సత్తెయ్య ఒగ్గుకథ చెప్పుడేందని ఎంతో మంది ఎదురు తిరిగిన్రు. చెప్పొద్దని అడ్డుకున్నరు. కానీ ఆయన కాలు ఆగలే. ఎట్లయితే అట్లయిందని ఎదురు నిలిచిండు. అడ్డు పడ్డోల్ల అడ్రసయితే లేదుగాని ఒగ్గుకథకు ఇప్పుడు సత్తేయ్యే అడ్రసయిండు. ఆయన ఆడని ఆటలేదు. పాడని పాటలేదు. ఇప్పుడొస్తున్న ఎన్నోపాటలకు ప్రాణం ఒగ్గుకథలల్లనే ఉన్నదంటడు సత్తెయ్య.
స్పాట్
తన తండ్రి దగ్గర్నుంచి ఒగ్గుకథలు చెప్పుడు నేర్బుకున్న సత్తేయ్య.. 16 ఏండ్ల సందే కథ చెప్పుడు షురు చేసిండు. తాను కథ చెప్పుడు మొదలేస్తే కూసున్నోళ్లు కథ అయిందనక లేవరంటడు సత్తెయ్య. అంత సక్కంగ చెప్పవట్టే సత్తెయ్య కథ దేశమంతా పాకింది. మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, కర్ణాటక, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ప్రదేశ్, కేరళ, తేజాపూర్, పాండిచ్చేరి రాష్ర్టాలలో మన ఒగ్గు కథ రుచి చూపించిండు సత్తెయ్య. ఒక్క ఢిల్లీలోనే ఇప్పటికి 26 సార్లు ఒగ్గు కథ చెప్పిండు. 1973 నుంచి ఇప్పటి వరకు ఢిల్లో ఒగ్గుగొంతు వినిపిస్తనే ఉండు. ఏ ఏటికాయేడు తన కథ కొత్తగనే ఉంటదంటడు సత్తెయ్య. అందుకనే ప్రతి యేడు తనను ఢిల్లీ పిలుచుకపోయి కథ చెప్పిస్తరని సగర్వంగా చెప్పుకుంటడు.
స్పాట్
ఒగ్గుకథ నమ్ముకొని జీవిస్తున్న ఈ కళామతల్లి ముద్దుబిడ్డ ఎందరో కళాకారులను తీర్చి దిద్దిండు. ఈయన కృషిని మెచ్చి ఇప్పటి వరకు అనేక మంది ముఖ్యమంత్రులు సత్కరించి సన్మానించిన్రు. రాష్ర్టపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా సాహిత్య అకాడమీ అవార్డునందుకున్నడు. కళాసాగర్ అవార్డు కూడా ఈయనను వరించింది. ఇక సన్మానాలు సత్కారాలకు కొదవే లేదు. 20 ఏండ్ల సంది తెలుగు యూనివర్సిటీ లో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్ధులకు ఒగ్గుకథ గురించి పాఠాలు నేర్పుతున్నడు.
స్పాట్
1931లో జన్మించిన ఈ తెలంగాణా కళామతల్లి ముద్దుబిడ్డ చేయని పోరు లేదు. తెలంగాణ బిడ్డల ఎతలు కండ్లార జూసిండు గనుకనే బడిత బట్టిండు. తెలంగాణ సాయుధ పోరాటంలో దూకిండు. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నడు. 80 ఏండ్ల పై బడ్డా కూడా ఉద్యమాల పాటలు హుషారుగా పాడుతడు. అదే గొంతు వినిపిస్తడు.

ఒగ్గు కథకు జీవం చుక్క సత్తెయ్య

ఎ.జనార్ధన్
స్పాట్
తెలంగాణ కళారూపాలలో ఒగ్గుకథకు ప్రత్యేక స్థానం ఉంది.. పల్లెలల్లో ఎనకటి వాళ్లకు వినోదాన్ని విజ్ఞానాన్ని పంచేది ఒగ్గుకథలే.. ఒగ్గుకథలు, బాగోతాలు, బుర్రకథలు, వీధి నాటకాలు ఇవ్వన్నీ అక్కచెల్లెండ్లే. ఇప్పడు డిజిటల్ మాయాజాలం కండ్లవడ్డంక ఈ ఒగ్గు కథలను బొగ్గుల్లో కలిన్రు. అయినా నేటికీ ఆ ఒగ్గు కథను నమ్ముకొని జీవించడమే కాదు.. ఆ ఒగ్గు కథకు జీవం పోస్తున్న కళాకారులు ఎందరో ఉన్నరు. అటువంటి కళాకారుల్లో పేరువడ్డ ఒగ్గుకథకుడే చుక్క సత్తెయ్య ..
స్పాట్
చుక్క సత్తెయ్య పుట్టింది వరంగల్ జిల్లా, లింగాల ఘనపురం మండలం, మాణిక్యాపురం గ్రామం. ఒగ్గుకథలు చెప్పుడు సత్తెయ్యకు వారసత్వంగా వచ్చిందే. సత్తెయ్య కు తండ్రి ఒగ్గుకథ నేర్పిండు. అల్లీరాణీ కథలు అలవోకగా వల్లెవేయగలడు సత్తేయ్య. అంతే కాదు కులపురాణాలు, వీధి భాగోతం ఆయన నాలుకపై నాట్యమాడుతుంటయి.
స్పాట్
చుక్క సత్తెయ్య ఒగ్గుకథ చెప్పుడేందని ఎంతో మంది ఎదురు తిరిగిన్రు. చెప్పొద్దని అడ్డుకున్నరు. కానీ ఆయన కాలు ఆగలే. ఎట్లయితే అట్లయిందని ఎదురు నిలిచిండు. అడ్డు పడ్డోల్ల అడ్రసయితే లేదుగాని ఒగ్గుకథకు ఇప్పుడు సత్తేయ్యే అడ్రసయిండు. ఆయన ఆడని ఆటలేదు. పాడని పాటలేదు. ఇప్పుడొస్తున్న ఎన్నోపాటలకు ప్రాణం ఒగ్గుకథలల్లనే ఉన్నదంటడు సత్తెయ్య.
స్పాట్
తన తండ్రి దగ్గర్నుంచి ఒగ్గుకథలు చెప్పుడు నేర్బుకున్న సత్తేయ్య.. 16 ఏండ్ల సందే కథ చెప్పుడు షురు చేసిండు. తాను కథ చెప్పుడు మొదలేస్తే కూసున్నోళ్లు కథ అయిందనక లేవరంటడు సత్తెయ్య. అంత సక్కంగ చెప్పవట్టే సత్తెయ్య కథ దేశమంతా పాకింది. మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, కర్ణాటక, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ప్రదేశ్, కేరళ, తేజాపూర్, పాండిచ్చేరి రాష్ర్టాలలో మన ఒగ్గు కథ రుచి చూపించిండు సత్తెయ్య. ఒక్క ఢిల్లీలోనే ఇప్పటికి 26 సార్లు ఒగ్గు కథ చెప్పిండు. 1973 నుంచి ఇప్పటి వరకు ఢిల్లో ఒగ్గుగొంతు వినిపిస్తనే ఉండు. ఏ ఏటికాయేడు తన కథ కొత్తగనే ఉంటదంటడు సత్తెయ్య. అందుకనే ప్రతి యేడు తనను ఢిల్లీ పిలుచుకపోయి కథ చెప్పిస్తరని సగర్వంగా చెప్పుకుంటడు.
స్పాట్
ఒగ్గుకథ నమ్ముకొని జీవిస్తున్న ఈ కళామతల్లి ముద్దుబిడ్డ ఎందరో కళాకారులను తీర్చి దిద్దిండు. ఈయన కృషిని మెచ్చి ఇప్పటి వరకు అనేక మంది ముఖ్యమంత్రులు సత్కరించి సన్మానించిన్రు. రాష్ర్టపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా సాహిత్య అకాడమీ అవార్డునందుకున్నడు. కళాసాగర్ అవార్డు కూడా ఈయనను వరించింది. ఇక సన్మానాలు సత్కారాలకు కొదవే లేదు. 20 ఏండ్ల సంది తెలుగు యూనివర్సిటీ లో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్ధులకు ఒగ్గుకథ గురించి పాఠాలు నేర్పుతున్నడు.
స్పాట్
1931లో జన్మించిన ఈ తెలంగాణా కళామతల్లి ముద్దుబిడ్డ చేయని పోరు లేదు. తెలంగాణ బిడ్డల ఎతలు కండ్లార జూసిండు గనుకనే బడిత బట్టిండు. తెలంగాణ సాయుధ పోరాటంలో దూకిండు. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నడు. 80 ఏండ్ల పై బడ్డా కూడా ఉద్యమాల పాటలు హుషారుగా పాడుతడు. అదే గొంతు వినిపిస్తడు.

చక్రి మ్యూజిక్ డైరక్టర్

ఎ. జనార్ధన్
తెలంగాణ కళావనంలో గుభాళించిన ఓ స్వర పరిమళం. ఉవ్వెత్తున ఎగసిపడే స్వరఝరి.. సర్వగమకాలను తన స్వరంలోకి ఆవహించిన తెలంగాణ గాన గంధర్వుడు. ఆయనే మన స్వరతరంగం చక్రి.
స్పాట్
సినీ సంగీత వినీలాకాశంలో అత్యంత తక్కువ సమయంలో తారాజువ్వలా దూసుకుపోయిన చక్రి పుట్టింది … ఉద్యమాల పురిటిగడ్డ మహబూబాబాద్.. తల్లి విద్యావతి, తండ్రి వెంకటనారాయణ. బాల్యమంతా సొంత గడ్డపైనే గడిచింది.. చక్రికి సంగీతం ఉగ్గుపాలతోనే అబ్బింది. అమ్మలాలి పాటలు నాన్నా జోల పాటలు చక్రికి సంగీతపు వారసత్వాన్నిచ్చినయి. తండ్రి వెంకటనారాయణ మంచి గాయకుడు, కంపోజర్. అదే వారసత్వాన్ని పుణికిపుచ్చుకుండు చక్రి. మహబూబాబాద్ లో స్కూల్ విద్య పూర్తయినంక వరంగల్లో డిగ్రీ పూర్తి చేసిండు. చక్రి సోదరి “ఆదర్శిణి” కూడా మంచి గాయని, తమ్ముడు “మహిత” త్వరలో మ్యూజిక్ డైరక్టర్ గా పరిచయం కాబోతున్నడు. చక్రి శ్రావ్యమైన సంగీతానికి తోడుగా “శ్రావణి” జీవిత భాగస్వామిగా జతగూడింది. తాను వేసే ప్రతి అడుగు వెనకా తన కుంటుంభ సభ్యుల సహకారం మరువలేనిదని చెప్పుకుంటడు ఈ స్వరశిల్పి.
స్పాట్
చక్రికి చిన్నతనం నుంచే సంగీతమంటే చెప్పలేని అభిమానం. ఆయనకు పాటే ప్రాణం.. వరంగల్ లో డిగ్రీ చదివేటపుడే తన భవిష్యత్తుకు బాటలు వేసుకుండు. సినిమా ఫీల్డ్ లోకి రాక ముందే 40కి పైగా ఆల్బంలు చేసిండు. చల్లగాలి… చిరునవ్వుతో..వంటి ఆల్బంలు చక్రి మంచి పేరు తెచ్చినయి.
స్పాట్
చక్రి ప్రతిభను గుర్తించిన పూరి జగన్నాధ్ తొలిసారి “బాచి” చిత్రంలో సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చిండు. 2000వ సంవత్సరంలో మొదలైన ఆ ప్రస్థానం నేటికీ సాగర స్వరాల్లా సాగిపోతూనే ఉంది. ఆయన గళం నుంచి జాలువారిన గమకాలెన్నో పల్లెలల్లో సుప్రభాతాలై నిద్దుర లేపుతయి. బాచి నుంచి జైభోలో తెలంగాణ వరకు ఆయన స్వరపరచిన ఎన్నో గేయాలు నిత్య పరిమళ స్వర పుష్పాలై గుభాళిస్తున్నయి.. ఇప్పటి వరకు చక్రి దాదాపు 90 కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన్రు. ఒక్కతెలుగులోనే కాక ఇతర దక్షణాది బాషా చిత్రాలకు కూడా పనిచేసిన్రు. ఇట్లు శ్రావణి సుభ్రమణ్యం, ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి, సత్యం, చక్రం, జై భోలో తెలంగాణ వంటి చిత్రాలు ఆయన అందించిన వాడిపోని స్వరపారిజాతాలు.
స్పాట్
చక్రి తాను వచ్చిన దారిని ఎప్పటికీ మరిచిపోలేదు.. స్నేహానికి ప్రాణమిచ్చే చక్రికి.. తన చుట్టూ ఉన్నవాళ్లు కూడా సంతోషంగా ఉండాలను కునే మనస్థత్వం. ఎందరో నూతన గాయనీ గాయకులకు అవకాశమిచ్చి వారి ఎదుగుదలకు దారి చూపిండు. అంతేకాదు .. తన పుట్టిన రోజు వంటి స్పెషల్ అకేషన్స్ లో పేదవారికి పాలు పళ్లు పంచిపెట్టడం, బట్టలు కొనివ్వడం, అనాధలకు కావలసిన వస్తువులు అందివ్వడం, రక్త ధాన శిభిరాలు నిర్వహించడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తడు. తనను నమ్ముకొని వచ్చిన వారికి నేనున్నానని అండగా నిలుస్తడు. అందుకే ఆయన మిత్రులు.. చక్రికి బలం, బలహీనత ఆయన మంచితనమేనని చెప్తరు.
స్పాట్
చక్రి ప్రతిభను ఇండస్ట్రీ గుర్తించింది. ఆయన స్వరాలకు నీరాజనం పలికింది. సత్యం సినిమాలో “ ఓ మగువా నీతో స్నేహం కోసం “ పాటకు సౌత్ ఇండియా నుంచి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. ఇదే కాక శంకర్, జయకిషన్ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డులు ఆయన సొంతం చేసుకున్నరు. సంతోషం వంటి అవార్డలు కూడా ఆయన సరసన చేరి తమ విలువ పెంచుకున్నయి. స్వయం కృషితో ఎదిగి ప్రతిభను నమ్ముకున్న చక్రి తెలంగాణ బిడ్డ కావడం మనందరం గర్వించదగ్గ విషయం.
స్పాట్

గంగా స్వాతి జానపద గాయనిలు

ఎ. జనార్దన్
తెలంగాణ తనువంతా జానపదాల జాతరే..ఈ పాటల పల్లకికి బోయీలుగా మారిన ఎందరో కళాకారులు తెలంగాణ కళామతల్లికి ముద్దుబిడ్డలు. కళల కణాచి తెలంగాణ మట్టిలో పుట్టిన వారసత్వ గేయాలను ఒడిసి పట్టి ముందుతరాలకు మోస్తున్న జానపద కళాకారులలో వర్ధమాన గాయనిలు గంగ, స్వాతి. తమ ఫోక్ వాయిస్ తో ఇటు కళాభిమానుల చేత విమర్శకుల చేత ప్రశంసల జల్లులుఉ కురిపించుకున్న ఈ జోడు గళాలు గొంతెత్తితే పల్లెకోయిలలు సైతం పరవశించి పోతయి.
స్పాట్
గంగ..పుట్టింది నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ముల్లంగి గ్రామం. తండ్రి అంకుల మల్లయ్య, తల్లి సాయమ్మ. జాబిలమ్మను చూపి తినిపించే గోరుముద్దల తోనే అమ్మ జానపదాలు నేర్పింది. స్కూల్ స్థాయిలో పాటలు పాడి ప్రతి పోటీలో జానపదాలను ఆలపించడంలో తన మార్కు వేసుకుంది. గంగ గళమెత్తితే ఎంత పెద్ద సభకూడా గాలిచప్పుడు వినపడేంత నిశ్శబ్దంగా మారుతదని అభిమానులు చెప్పుకుంటరు. వాగ్దేవి డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండవ సంత్సరం చదువుతోంది.
స్పాట్
గంగ ఎంటర్ టైన్ మెంట్ చానళ్లలో, న్యూస్ చానళ్లలో మ్యూజికల్ ప్రోగ్రాంలలో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకొంది. మాటీవి నిర్వహించే రేలారే రేలా , సూపర్ సింగర్స్ కార్యక్రమాలలో ముందంజలో నిలిచింది. గంగ గళ మాధుర్యానికి పరవశించిన అనేక మంది ప్రముఖులు వివిధ జిల్లాలలో ప్రదర్శనలిప్పించిన్రు. తెలంగాణ ధూంధాంలలో ప్రదర్శనలిచ్చి ఉద్యమంలో తన వంతు పాత్రపోషించింది. 2007 నుంచి అనేక ప్రజా చైతన్య కార్యక్రమాలలో పాల్గొంటూ జానపదాలను జనబాహుళ్యంలోకి తీసువెళ్తున్నది గంగ.
స్పాట్
స్వాతి.. ఈ జానపదాల మధురగాయని పుట్టింది నల్లగొండ జిల్లా మోత్కూర్ మండలం అడ్డగూడూరు గ్రామం. తండ్రి పూర్ణయ్య తల్లి పుష్ప. డిగ్రీ వరకు చదువుకుంది. మల్టీ మీడియాలో ప్రవేశించిన స్వాతికి రేలా రె రేలా లో అవకాశం వచ్చింది. మొదటి ఎపిసోడ్తో మొదలైన ప్రస్థానం చివరి ఎపిసోడ్లో విజేతగా నిలిచే వరకు సాగింది. సూపర్ సింగర్స్లో కూడా తన సత్తా చాటింది. స్వాతి స్వరంలో జానపదాలు చేసే లయవిన్యాసం మాధుర్యం ఇంటి ఆడపడుచును గుర్తుకు తెస్తది. బతుక్మ పాటలు, ఉయ్యాల పాటలు ఆమె నోటినుంచి అలవోకగా జాలువారుతుంటయి. పల్లెపాటకు ప్రాణం పోస్తున్నస్వాతి వర్థమాన జానపద కళాకారులకు ఆదర్శంగా నిలుస్తుంది.తన తోటి కళాకారులను ప్రోత్సహిస్తుంది.

కొండయ్య. నత్తి సత్తి

ఎ. జనార్ధన్
వాయిస్
పల్లెదనాన్ని ఒళ్లంతా నింపుకొని పాదచారిలా, పాటచారిలా వెళుతున్న ఈ గ్రామీణ కళాకారుడి పేరు.కొండయ్య.. కొండయ్యది మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామం. తండ్రి రాములు, తల్లి సత్తెమ్మ. చిన్నతనం నుంచే పాట పాడటమంటే మహాసరదా.. పాట కొండయ్యకు వారసత్వం కాదు. ఈయన పాటలకు ప్రకృతే గురువు.. సంగీత పరిజ్ఞానం లేని కొండయ్య వినసొంపైన బాణీలు కట్టడంలో దిట్ట. అంతేకాదు.. ఆ బాణీలలో పల్లెతనాన్ని పలరించే పదాలను చిలకరించి కొత్త రూపం తెస్తడు కొండయ్య. అందుకే ఆయన పాటలు పల్లెపల్లెనా పల్లవించినయి. గొంగడి భుజాన వేసుకొని మూగజీవాలతో మనసులో మాటలు చెప్పుకునే కొండయ్యకు మొదటి ప్రేక్షకులు కూడా అవే.. కంజీరా చేతిలో పట్టుకొని గంగా ప్రవాహాల్లాంటి పాటలను పలికిస్తుంటే గోరువంకలు, చిలకమ్మలు కొండయ్య పాటకు కోరస్ పలుకుతయి.
స్పాట్( బ్యాగ్రౌండ్ ..చిలకమ్మ..చిలకమ్మా..)
జానపదాలంటే ప్రాణమిచ్చే కొండయ్య వాటికి ప్రాణం పోయాలని ఉబలాట పడ్డడు. కాలగర్బంలో కలిసిపోతున్న జానపదాలకు జీవంపోయాలని.. తాను ప్రాణంగా చూసుకొనే గొర్రెలనమ్మి ఆడియో సిడి చేసిండు. ఆ పాటలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది కానీ గొర్రెల మందను తిరిగి తెచ్చుకోలేని పేదరికం మాత్రం అట్లనే మిగిలింది. పేదరికంలో ఉండి కూడా పాటలను బతికించాలను కున్న కొండయ్య మరో ఆడియో సిడికి చేసేందుకు సిద్దపడుతున్నడు. కొండయ్య పాటలు పసిడి కొండల్లా పదికాలాల పాటు నిలవాలని కోరుకుంటున్నరు ఆయన అభిమానులు.
2వస్టోరీ.
వాయిస్
పాట పాడాలంటే మంచి స్వరం..చక్కని ఉచ్చారణ కావాలి అని అనుకుంటరు. కానీ అవేవీ లేకపోగా మాట మాట్లాడటమే కష్టంగా మారిన వ్యక్తి సత్యనారాయణ. మాటలు స్పష్టంగా మాట్లాడలేని నత్తి ఆయనకు శాపంగా మారింది. అయినా ఆయన పాటలు పాడాలన్న తన లక్ష్యాన్ని వదులు కోలేదు. వైకల్యాన్ని అధిగమించి పాటను సొంత చేసుకున్న సత్యనారాయణది మహబూబ్ నగర్ జిల్లా అమరచింత గ్రామం. ఇప్పడిక సత్యనారాయణ పాటల సత్తిగా అందరికీ చిరపరిచయం. పాటల సత్తిగా మారడానికి సత్యం పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీకావు. ఎందుకంటే సత్యనారాయణ పుట్టగానే గాయకుడు కాదు. తాపీ మేస్ర్తీ వృత్తి. అప్పుడప్పుడు పశువులు కాసుకునే వాడు. పశువులు కాసుకునే వాడికి పాటేంటని ఎగతాళి చేసిన్రు. అంతేకాదు మాటే సరిగా రాని సత్యానికి పాటకూడానా అని హేళన చేసిన్రు. ఆ మాటలు సత్యనారాయణలో మరింత బలాన్ని పెంచినయి. ఎలాగైనా పాట పాడి తీరాలనుకున్నడు. తనలో దాగిన కళను వెలికి తీసేందుకు కఠోర శ్రమ చేసిండు. ఖాళీ సమయాల్లో పాట ప్రాక్టీస్ చేసిండు. ఆయన చేసిన శ్రమ ఫలితంగా నేడు ఆయన ఇంటి పేరే పాటగా మారింది. ఒకప్పుడు నత్తి సత్తి అన్నవాళ్లే నేడు కత్తిలాంటి పాటల సత్తి అంటున్నరు. అయినా గతాన్ని తవ్వి గుర్తుచేసుకొనే ఓపికా, తీరికా సత్యానికి లేదు. ఎందుకంటే తన ఏరియాలో ఎక్కడ ధూంధాం జరిగినా.. మీటింగులు జరిగినా మొదటి పాట సత్యానిదే..వైకాల్యాన్ని అధిగమించి కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్న సూత్రానికి సత్యమే ప్రత్యక్ష నిదర్శనం.
స్పాట్

కందికొండ

ఎ. జనార్ధన్
నవరసాలూరించే పాటలు రాయడమంటే అంత తేలిక కాదు. రాసిన ప్రతి పాటా ఆడియన్స్ నోళ్లలో నానించడమూ అంత ఈజీ కాదు. కానీ రాసిన ప్రతి పాటనూ ఒక కోటగా మార్చిన ఘనత కందికొండది.
స్పాట్
సినీ ఫీల్డ్ లో, తన సొంత గ్రామం వారికి తప్ప ఇంత చక్కని స్వరాలూరించే పాటలు రాసిన కందికొండ గురించి చాలా మందికి తెలియదు. మళ్ళి కూయవే గువ్వా పాట తెలియని సంగీతాభిమాని లేడు. అంతేకాదు గలగల పారుతున్నగోదిరిలా పాట హమ్మింగ్ చేయని వారుండరు. కానీ ఈ పాటలకు ప్రాణం పోసిన కవి కందికొండ.
స్పాట్
కందికొండ పుట్టింది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగూర్లపల్లి గ్రామం. ప్రాథమిక విద్య సొంతూర్లో పూర్తయింది. డిగ్రీ వరకు మహబూబా బాద్ లో చదువుకున్నరు. యం.ఎ తెలుగు లిటరేచర్ పూర్తి చేసి యం.ఎ పొలిటికల్ సైన్స్ చదువుతున్నరు.
స్పాట్
కందికొండ తాను చదువుకునే రోజుల నుంచే పాటలు రాయడం నేర్చుకుండు. మొదట్లో జానపద గీతాలు రాస్తున్న కందికొండకు సినీ సంగీత దర్శకుడు చక్రి సాన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపిండు. చక్రి సంగీత దర్శకత్వంలో తొలిసారిగా ఇట్లు శ్రావణి సుభ్రమణ్యం. చిత్రంలో మళ్లి కూయవే గువ్వా పాటరాసి తానేంటో నిరూపించుకున్నడు.
స్పాట్( మళ్లి కూయవే గువ్వా పాట)
ఈ పాట తరువాత కందికొండ వెనకడుగు వేసింది లేదు. పాట వెంట పాట పందిరిలా సినీ సంగీతాభిమానులను అల్లుకుపోయినయి. తన చాలా పాటలకు ప్రాణం పోసింది చక్రియే నని, తానింతటి వాడు కావడానికి తనను ప్రోత్సహించింది చక్రీ అని వినమ్రంగా చెప్పుకుంటడు.
స్పాట్