ఎ.జనార్దన్
డప్పు దరువుతో, తెలంగాణ దండోరా వేస్తున్న ఈ గాయకుడి పేరు శనిగరం బాబ్జి.. వందలాది ఉద్యమసభల్లో గజ్జకట్టి గళమెత్తిన బాబ్జి పుట్టింది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్. తండ్రి రామయ్య, తల్లి లచ్ఛమ్మ. పాఠశాల వయసు నుంచే పాట పాడటం నేర్చుకున్నడు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో రకాల జానపద పాటలకు, ఉద్యమ గేయాలకు బాబ్జీ గళం ప్రాణం పోసింది.
స్పాట్
శనిగరం బాబ్జి మొదట్లో నాస్తికత్వం పై అనేక ప్రదర్శనలిచ్చిండు. మూఢనమ్మకాల పట్ల ప్రజలను చైతన్యం చేసేందుకు ఎన్నో వేదికల పై తన ప్రదర్శనలిచ్చిండు. నోట్లో మంటలు పుట్టించడం, నిప్పులపై నడక వంటి ప్రదర్శనలతో ప్రజల్లో మూఢనమ్మకాలను తొలగించే ప్రయత్నం చేసిండు. తాను ఆదర్శంగా ఉండి ప్రజలకు ఆదర్శాల గురించి చెప్పాలని కులాంతర వివాహం చేసుకుండు. కమలాపూర్ మండలం కన్నూర్ గ్రామానికి చెందిన అరుణను కులాంతర వివాహం చేసుకున్నడు. బాబ్జి ఒక్క తెలంగాణలోనే కాక దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలిచ్చి మేథావుల చేత ప్రశంసలందుకున్నడు.
స్పాట్
తెలంగాణలో జరుగుతున్న దోపిడి గురించి అనేక ధూంధాం సభల్లో నినదించిండు. ఓపెన్ కాస్ట్ గనుల పేర జరుగుతున్నదోపిడిని విన్పించిండు. తెలంగాణ నీళ్ళను తరలించుకు పోయే ప్రాజెక్ట్ లకు వ్యతిరేకంగా చేసిన పాదయాత్రలో పాల్గొన్నడు. గత పద్నాలుగేళ్లుగా తన గళమాధుర్యంతో ఎన్నో పాటలు పాడి ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నడు శనిగరం బాబ్జి..
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి