29, ఏప్రిల్ 2011, శుక్రవారం

జడల రమేష్ జానపద గాయకుడు

ఎ. జనార్ధన్
తెలంగాణ మట్టిలో జానపద గీతాలు జలపాతల్లా జలజలా రాలి పడతయి. పల్లె జనం ఆ జానపద జల్లుల్లో తడిసి పులకిస్తది. ఆ పదాలను తన పెదాలపై అలవోకగా ఆడించగల పల్లెగాయకుడు జడల రమేష్.. పుట్టింది కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. తండ్రి రాజవీరు, తల్లి కళావతి. భార్య తేజస్విని, పిల్లలు అపూర్వ, వర్షిత్. బతుకు బాటకు నేత వృత్తిని, బతుకు పాటకు జానపదాన్ని ఎంచుకున్నడు రమేష్..
స్పాట్
రమేష్ .. కండెలు చుట్టడం, సాంచెలు నడపడం అలవోకగా చేయగలడు. ఉగ్గుపాలతో నేర్చుకున్న మగ్గం విద్య ఊరికొయ్యలకు ఎలా పంపుతుందో పాటగట్టిండు. సిరులొలికే సిరిసిల్ల ఉరిసిల ఎలా అయిందో తన పాటలల్లో వివరించిండు. నేతకార్మికుల కష్టాలన్నీ తన పాటల్లో పొదిగిండు. తానే ఖర్చు భరించి నేత బతుకుల పై ఒక ఆడియో సిడి విడుదల చేసిండు. ఇప్పటికి రెండు వేల క్యాసెట్లలో పాడిండు. 5వేల పాటలు పాడిండు. 7 భాషల్లో తన గళమాధుర్యాన్ని నింపిండు.
స్పాట్
ప్రజా కళాకారుడిగా అనేక ప్రజాచైతన్య సభల్లో పాల్గొని ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రయత్నించిండు. మొదటి పాట సిరిసిల్ల ఫ్రెండ్స్ ఆర్కెస్ర్టాలో పాడి తన సత్తా చాటిండు. అనేక ధూంధాం సభల్లో పాల్గొన్నడు. ఆద్యాత్మిక కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటడు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పొషించిండు జడల రమేష్. ఈయన నైపుణ్యానికి ప్రజల నుంచి మంచి ఆధరణ లభించింది. వేములవాడ దేవస్థానం నుంచి ఉత్తమగాయకుడి అవార్డు అందుకున్నడు. హైదరాబాద్ పాత బస్తీలో నిర్వహించిన కచేరీలో వచ్చిన గుర్తింపుకు వెండి కిరీటం బహుకరించిన్రు. కరీంనగర్ లో జరిగన స్వదేశీ జగరణ్ మేళలో జానపద కవిగాయక శిఖామణి అన్నబిరుదునిచ్చి సన్మానం చేసిన్రు. తెలంగాణ బాషలో రామాయణాన్ని రాసి పాడి అమ్మనేనుబోతున్నలంకలోకి పేరుతో వీడియో సిడి చేసిన్రు. ఈ కాసెట్ బహుళ ప్రజాదరణ పొందింది.

స్పాట్
రమేష్ కు నటనలో కూడా మంచి అనుభవం కలదు. అనేక డాక్యుమెంటరీలలో నటించిండు. వివిధ రకాల కళారూపాలలో, నృత్యరూపకాలలో ఆడిపాడిండు.. ప్రజా సేవే తన లక్ష్యమని, పాటద్వారా ప్రజలను చైతన్యం చేస్తనని సగర్వంగా చెప్పుకుంటడు జడల రమేష్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి