29, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఆకునూరి దేవయ్య (తెలంగాణ గళం)

ఎ.జనార్ధన్
స్పాట్
తెలంగాణ ఉద్యమంలో ఎందరో కవులు గాయకులు తమ పూర్తి కాలాన్ని ఉద్యమానికి అంకితం చేశారు. తెలంగాణలో ఊరూరా వాడవాడనా ఇటువంటి కవి గాయకులకు కొదవలేదు. తెలంగాణలో ఏ కొమ్మను కదిలించినా జానపదాలను జల్లున రాల్చుతది. ఉద్యమ పాలటను ఊటలా రాల్చుతది. అలువంటి పాటల ఊటే ఆకునూరి దేవయ్య.
స్పాట్
ఆకునూరి దేవయ్య పుట్టింది కరీంనగర్ జిల్లా సిరిసిల్ల గ్రామం. తండ్రి ఆకునూరి నర్సవ్వ, తండ్రి వెంకటయ్య. డిగ్రీ వరకు చదువుకున్న దేవయ్యకు పాటంటే ప్రాణం. స్కూల్ చదివేటపుడే దేవయ్యలో పాటగాడు నిద్రలేచిండు. తన తోటి వారి ముందు జానపద గీతాలు ఆలపించి శబాస్ అనిపించుకున్నడు. అదే స్పూర్తి దేవయ్యలో కొనసాగింది. ఏ కొత్త జాన పదం విన్నా ఇట్టే పట్టేస్తడు. జాన పదాలను సేకరించి ముందు తరాలకు అందివ్వాలనే లక్ష్యంతో పనిచేస్తుండు.
స్పాట్
ఆకునూరి దేవయ్య పాటలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఇప్పటికే ఎన్నో ప్రదర్శనలిచ్చిండు. మొట్టమొదటి సారిగా 1984లో రేడియోలో జానపదగీతాన్ని ఆలపించిండు. ఆ తరవాత రేడియోలో ఎన్నోప్రదర్శినిచ్చిండు. 1994లో దూరదర్శన్లో కూడా జానపదాల రుచి చూపించి ప్రజలకు మరింత చేరువయిండు.
స్పాట్
తెలంగాణ మలిదశ ఉద్యమంలో దేవయ్య పాత్ర మరవలేనిది.ఎన్నో తెలంగాణ ధూంధాలలో పాల్గొని ప్రజాచైతన్యం కోసం పాటు పడిండు. ఆయన ఆలపించిన తలాపునా పారుతుంది గోదారి అన్నపాట, రేలాదూలా అన్న పాట ప్రజా బాహుళ్యంలో ఇంకిపోయినయి.ఒక్కకరీంనగర్ లోనే కాదు తెలంగాణ ప్రాంతం మొత్తంలో ఈ పాటలు మార్మోగి పోయినయి.
స్పాట్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి